
సంజీవ్ గుప్తా ఫిర్యాదు:
ద్రవిడ్ ప్రస్తుతం ఎన్సీఏ డైరెక్టర్గా, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంలోని ఇండియా సిమెంట్స్ సంస్థ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. దీంతో ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తాడని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేసాడు.

ఎథిక్స్ అధికారికి వాదనలు:
విరుద్ధ ప్రయోజనాల విచారణలో భాగంగా బీసీసీఐ ఎథిక్స్ అధికారి ఎదుట ఈ ఏడాది సెప్టెంబర్ 24న వ్యక్తిగతంగా ద్రవిడ్ హాజరయ్యాడు. ప్రస్తుతం తాను ఇండియా సిమెంట్స్ విధుల్లో లేనని, అలాంటప్పుడు చెన్నై జట్టుతో సంబంధం ఎలా ఉంటుందని వివరణ ఇచ్చాడు. మరోసారి (ఈ నెల 12న) కూడా ద్రవిడ్ ఎథిక్స్ అధికారి ఎదుట హాజరయి తన వాదన వినిపించాడు.

ద్రవిడ్కు లైన్ క్లియర్:
వాదనలు విన్న అధికారి ద్రవిడ్ విరుద్ధ ప్రయోజనాలు పొందలేదని, ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పాడు. ఎన్సీఏ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించేటప్పుడు ద్రవిడ్ ఇండియా సిమెంట్స్ నుండి సెలవు తీసుకున్నట్లు కూడా తెలిపాడు.

వినోద్ రాయ్ నోట్:
మొదటిసారి ద్రవిడ్ ఎథిక్స్ అధికారి హాజరయ్యే ముందు ఎథిక్స్ అధికారికి అప్పటి సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ ఓ నోట్ పంపారు. ఇండియా సిమెంట్స్లో ద్రవిడ్ వేతనం లేకుండా సెలవు తీసుకుంటే.. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన పరిధిలోకి రాడని పేర్కొన్నాడు. చికాగో విశ్వవిద్యాలయం నుంచి సెలవు తీసుకొని ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన రఘురామ్ రాజన్, కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి సెలవు తీసుకొని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్గా పనిచేసిన అరవింద్ పనగడియా గురించి రాయ్ లేఖలో వివరించారు.


Click it and Unblock the Notifications












