హైదరాబాద్: ఇంగ్లాండ్ లయన్స్తో తలపడతే భారత్-ఎ జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించారు. జనవరి 23 నుంచి ఐదు మ్యాచ్ల సిరీస్ జరుగనుంది. ఇందులో భాగంగా తొలి మూడు వన్డేలకు, ఆ తర్వాత నాలుగు, ఐదు వన్డేలకు వేరువేరుగా జట్లను ప్రకటించారు. ఈ జట్టుకు భారత టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు.
జనవరి 29, 31న జరిగే చివరి రెండు వన్డేల్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బరిలోకి దిగుతాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 6 నుంచి జరిగే టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్కు బయలుదేరి వెళ్లనున్నాడు. హైదరాబాదీ హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, కృనాల్ పాండ్యాలు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
చివరి రెండు మ్యాచ్లకు మహారాష్ట్ర బ్యాట్స్మన్ అంకిత్ బావ్నే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఫిబ్రవరి 7 నుంచి వాయనాడ్లో ఇంగ్లాండ్ లయన్స్తో రెండు నాలుగు రోజుల మ్యాచ్ కూడా జరుగనున్నాయి.
తొలి మూడు వన్డేలకు జట్టు:
రహానే (కెప్టెన్), అన్మోల్ప్రీత్, రితురాజ్, శ్రేయాస్, విహారి, అంకిత్ బావ్నే, ఇషాన్ కిషన్, క్రునాల్ పాండ్యా, అక్షర్ పటేల్, మయాంక్ మర్కండే, జయంత్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, నవ్దీప్ సైనీ.
చివరి రెండు వన్డేలకు జట్టు:
అంకిత్ బావ్నే (కెప్టెన్), రితురాజ్, అన్మోల్ ప్రీత్, రికీ భుయ్, సిద్ధేశ్ లాడ్, హిమ్మత్ సింగ్, పంత్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, నవ్దీప్ సైనీ, ఆవేశ్ ఖాన్, దీపక్ చాహర్, శార్దూల్.