హైదరాబాద్: అబుదాబి వేదికగా జరగనున్న టీ10 లీగ్లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కలందర్స్ జట్టు జట్టు తరుపున బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు కలందర్స్ జట్టు యాజమాన్యం అఫ్రిదితో ఒప్పందం కుదుర్చుకుంది.
అఫ్రిది మాట్లాడుతూ "టీ10 లీగ్లో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉంది. ఈసారి టోర్నీ అబుదాబిలో నిర్వహించనున్నట్లు విన్నాను. టీ10 లీగ్లో భాగంగా తొలి రెండు ఎడిషన్లకు షార్జా ఆతిథ్యమిచ్చింది. తాజా సీజన్కు అబుదాబి ఆతిథ్యమిస్తోంది. ఈ సందర్భంగా అభిమానులకు తగిన వినోదాన్ని అందించడానికి మేం సిద్దంగా ఉన్నాం" అని అన్నాడు.
బీసీసీఐకి గంభీర్ విజ్ఞప్తి.. యువరాజ్ జెర్సీకి రిటైర్మెంట్ ఇవ్వాలి!!
"టీ20 ఫార్మాట్ భిన్నమైంది. మ్యాచ్ ఆరంభం నుంచే బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడతారు. అన్ని ఫార్మాట్లకు అభిమానులు ఉండటం ఎంతో భిన్నమైంది" అని అఫ్రిది చెప్పుకొచ్చాడు. అబుబాదిలో జరగనున్న టీ10 లీగ్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. కాగా, కలందర్స్ జట్టు ఎక్కడో విన్నట్టుందని అనుకుంటున్నారా?
అవును... పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఉన్న లాహోర్ కలందర్స్ జట్టు యాజమాన్యం టీ10 లీగ్లో ఉన్న కలందర్స్ జట్టు యాజమాన్యం ఇద్దరూ ఒక్కరే కావడం విశేషం.