న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తప్పుల నుండి నేర్చుకుంటాం: రహానే

Punjab vs Rajasthan: We Should learn from our mistakes Rahane

తప్పుల నుండి నేర్చుకుంటున్నాం.. వచ్చే మ్యాచ్‌లలో వాటిని అధిగమిస్తాం అని రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ అజింక్య రహానే తెలిపారు. మంగళవారం రాత్రి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో రాజస్థాన్‌ ఖాతాలో ఆరో ఓటమి చేరడంతో ప్లేఆఫ్‌ అవకాశాలు మరింత క్లిష్టమయ్యాయి. మ్యాచ్ అనంతరం రాజస్థాన్‌ కెప్టెన్‌ అజింక్య రహానే ఈ ఓటమిపై స్పందించాడు.

ఎవరినీ నిందించలేం:

ఎవరినీ నిందించలేం:

అజింక్య రహానే మాట్లాడుతూ... ఈ వికెట్‌పై 183 పరుగుల లక్ష్యం ఛేదించదగినదే. బ్యాటింగ్‌లో మంచి ఆరంభమే లభించింది. కేవలం రెండు సిక్సులు మ్యాచ్‌ను దూరం చేశాయి. ఇలాంటి మ్యాచ్‌లలో ఎవరిని నిందించలేం. ఛేదనలో చాలా వికెట్లు కోల్పోవాల్సింది కాదు. బిన్నీతో చర్చించా.. మ్యాచ్‌ను ముగించాలనుకున్నాం. కానీ అది జరగలేదు. బిన్నీ మాత్రం చివరి వరకు విజయం కోసం ప్రయత్నించాడు' అని రహానే తెలిపారు.

తప్పులను అధిగమిస్తాం:

తప్పులను అధిగమిస్తాం:

'త్రిపాఠి ఓపెనింగ్‌లో బాగా రాణించాడు. అద్భుత బ్యాటింగ్ చేసి జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అయితే మధ్య ఓవర్లలో మేము అదే ఊపును కొనసాగించలేకపోయాం. టీ20 క్రికెట్లో ఇది సహజం. తప్పుల నుండి నేర్చుకుంటున్నాం.. వచ్చే మ్యాచ్‌లలో వాటిని అధిగమిస్తాం. ఇద్దరు లెగ్ స్పిన్నర్లు మధ్య ఓవర్లలో బాగా బౌలింగ్ చేసారు. స్పిన్నర్లతో పాటు ఆర్చర్‌ కూడా రాణించాడు' అని రహానే చెప్పుకొచ్చారు.

పంజాబ్‌ విజయం:

పంజాబ్‌ విజయం:

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ లోకేశ్‌ రాహుల్‌ 52(47 బంతుల్లో; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిల్లర్‌ 40(27 బంతుల్లో; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ అశ్విన్‌ 17 నాటౌట్‌ (4 బంతుల్లో; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పరుగులు చేసారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌.. 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి ఓటమిని ఎదుర్కొంది. రాహుల్‌ త్రిపాఠి 50(45 బంతుల్లో; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో స్టువర్ట్ బిన్నీ (11 బంతుల్లో; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. అశ్విన్ 2 వికెట్లు తీశాడు. బ్యాట్, బంతితో మెరిసిన అశ్విన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Story first published: Wednesday, April 17, 2019, 15:22 [IST]
Other articles published on Apr 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X