అసలేం జరిగింది?
నిజానికి బయటి వ్యక్తులకు పిచ్ దగ్గరికి వెళ్లే అనుమతి ఉండదు. కానీ పాండురంగ బీసీసీఐ, ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా రిపోర్టర్లను క్యూరేటర్ పిచ్ వద్దకు తీసుకెళ్లాడు. క్రికెట్ బుకీల రూపంలో వచ్చిన రిపోర్టర్లతో పిచ్ క్యూరేటర్ మాట్లాడుతూ 'ఒకరిద్దరు ఆటగాళ్లు బౌన్సీ పిచ్ కావాలని కోరుతున్నారని, అది జరుగుతుందా?' అని అడగ్గా 'సరే, పిచ్ ను అలాగే మారుస్తా' అంటూ సమాధానమిచ్చాడు. అంతేకాదు పిచ్ను బ్యాటింగ్కు సహకరించేలా పిచ్ను తయారుచేస్తానని 337 నుంచి 340 పరుగుల చేసే అవకాశం ఉందని చెప్పి స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయాడు.

ఈ ఘటనపై స్పందించిన బీసీసీఐ
బీసీసీఐ తరఫు ప్రతినిధి కూడా ఇక్కడే ఉన్నాడు అని పాండురంగ చెప్పాడు. ఐసీసీ లేదా బీసీసీఐ అడిగితే పిచ్ దగ్గరికి ఎవరూ రాలేరని చెబుతాను అని అతను అన్నాడు. ఇదే సమయంలో మరికొందరు పిచ్పై అటూ ఇటూ నడవడం కూడా ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనపై బీసీసీఐ స్పందించింది.

కఠిన చర్యలు తీసుకుంటాం
కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పష్టంచేశారు. 'దీనికి ఎవరు బాధ్యులైనా సరైన దిశలో చర్యలు తీసుకుంటాం. ఇలాంటి విషయాలను బీసీసీఐ అసలు సహించదు' అని ఆయన అన్నారు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్తో కూడా ఈ విషయంపై మాట్లాడినట్లు అమితాబ్ చౌదరి చెప్పారు.
గతంలో పాండురంగ మంచి ఫస్ట్క్లాస్ క్రికెటర్
పాండురంగ గతంలో మంచి ఫస్ట్క్లాస్ క్రికెటర్ అని, అతను ఇలా చేయడం నమ్మలేకపోతున్నానని ఆయన అన్నారు. ఇక, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా పిచ్ ఫిక్సింగ్ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ మొత్తం ఘటనపై విచారణ జరపనున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











