
ముగ్గురు పేసర్లు
ఇకపోతే భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఆసియా కప్ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. అలాగే హర్షల్ పటేల్ సైతం గాయం వల్ల దూరమయ్యాడు. దీంతో యువ పేసర్లు అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక పుజారా తన ప్లేయింగ్ XIలో ముగ్గురు పేసర్లు ఉండాల్సిందేనని పేర్కొన్నాడు. భువనేశ్వర్ కుమార్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనుండగా.. అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ అతనికి సపోర్ట్ రోల్లో ఉండనున్నారు.

డీకేకు నో ఛాన్స్
ఇకపోతే అందరూ పేర్కొంటున్నట్లే టాపార్డర్లో రోహిత్, రాహుల్, విరాట్ కోహ్లీలను పుజారా తన ప్లేయింగ్ 11లో పేర్కొన్నాడు. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్లను నంబర్ 4, నంబర్ 5 స్థానాల్లో బరిలో దిగే బ్యాటర్లుగా పేర్కొన్నాడు. ఇకపోతే స్పెషలిస్టు ఫినిషర్ అయిన దినేష్ కార్తీక్కు మాత్రం తన ప్లేయింగ్ 11లో పుజారా చోటివ్వలేదు. ఇకపోతే ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్రా జడేజాలను పేర్కొన్నాడు. ఇక స్పెషలిస్టు స్పిన్నర్గా యుజ్వేంద్ర చాహల్ను ఎంచుకున్నాడు.

పుజారా పేర్కొన్న టీమిండియా ప్లేయింగ్ 11 :
1.రోహిత్ శర్మ (కెప్టెన్), 2.కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), 3.విరాట్ కోహ్లీ, 4.సూర్యకుమార్ యాదవ్, 5.రిషబ్ పంత్ (వికెట్ కీపర్), 6.హార్దిక్ పాండ్యా, 7.రవీంద్ర జడేజా, 8.భువనేశ్వర్ కుమార్, 9.అవేష్ ఖాన్, 10.అర్ష్దీప్ సింగ్, 11.యుజ్వేంద్ర చాహల్


Click it and Unblock the Notifications












