For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PSL vs IPL: క్రికెట్ లీగ్‌ల మధ్య 'బ్రాండ్' యుద్ధం.. గెలిచిందెవరు?

PSL vs IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. పాకిస్తాన్ సూపర్ లీగ్ దీని దరిదాపుల్లో కూడా లేదు. అయినప్పటికీ పాకిస్తానీయులు తమ పీఎస్ఎల్‌ను ఐపీఎల్ కంటే మెరుగైనదిగా చూపడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో ప్రపంచంలోని టాప్ ప్లేయర్స్ పాల్గొంటారు. ఇందుకోసం వారికి భారీ మొత్తంలో పారితోషికం అందుతుంది. అందుకే ఐపీఎల్ జరిగే సమయంలో ఏ దేశం కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించడానికి సాహసించదు, ఎందుకంటే ఆటగాళ్లు ఐపీఎల్ ఆడటానికి అంతర్జాతీయ మ్యాచ్‌లను సైతం వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఐపీఎల్ ప్రస్తుతం ప్రపంచంలోని టాప్-5 క్రీడా లీగ్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది. మరోవైపు పీఎస్ఎల్ 2016లో ప్రారంభమైంది. ఇది కేవలం 6 జట్ల లీగ్ మాత్రమే.

వసీం అక్రమ్ 'బోరింగ్' కామెంట్స్‌పై విమర్శలు
పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ IPLను 'బోరింగ్' అని అభివర్ణించారు. ఐపీఎల్‌లో 10 జట్లు, 75 మ్యాచ్‌లు ఉంటాయి."పిల్లలు పెద్దవాళ్లవుతారు కానీ లీగ్ మాత్రం పూర్తి కాదు." అని వసీం అక్రమ్ వ్యాఖ్యానించగా.. తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 6 జట్ల PSLలో కేవలం 34 మ్యాచ్‌లు మాత్రమే ఆడతారు. కానీ అక్రమ్ గమనించని విషయం ఏమిటంటే.. PSLలో ఏడో జట్టును చేర్చాలంటే, ఆ లీగ్‌కు ఆటగాళ్లు దొరకడం కూడా కష్టమేమో! అందుకే సుమారు దశాబ్దం గడిచినా PSLలో జట్ల సంఖ్య పెరగడం లేదు.

PSL vs IPL The Battle of Cricket Brands Who Really Wins

ప్రైజ్ మనీ తేడా చూస్తే షాక్ అవుతారు!
ఐపీఎల్, పీఎస్ఎల్ మధ్య ఆర్థిక వ్యత్యాసం ఎంత ఉందో ప్రైజ్ మనీ చూస్తే అర్థమవుతుంది. ఐపీఎల్ తన మొదటి సీజన్‌లోనే (2008లో) విజేతకు రూ.4.8 కోట్లు ఇచ్చింది (విన్నర్ రాజస్థాన్ రాయల్స్). అదే సమయంలో పీఎస్ఎల్ 2024 విజేత (ముల్తాన్ సుల్తాన్స్)కు కేవలం రూ.4.13 కోట్లు మాత్రమే దక్కాయి. అంటే, 18 సంవత్సరాల క్రితం ఐపీఎల్ ఇచ్చిన మొత్తమే, ఇప్పుడు PSL ఇస్తోంది! ప్రస్తుతం ఐపీఎల్ విజేత జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది.

రిటైరైన ఆటగాళ్లు పీఎస్ఎల్‌కు వెళ్తున్నారు..
ఐపీఎల్, పీఎస్ఎల్ ఒకే సమయంలో జరుగుతుండటంతో ఆటగాళ్లు ఏదో ఒక లీగ్‌ను మాత్రమే ఎంచుకోవాల్సి వస్తోంది. ఫాఫ్ డు ప్లెసిస్ ఐపీఎల్ 2026లో ఆడకూడదని నిర్ణయించుకుని, పీఎస్ఎల్ తదుపరి సీజన్‌లో ఆడనున్నారు. మొయిన్ అలీ కూడా ఐపీఎల్ బదులు పీఎస్ఎల్‌ను ఎంచుకున్నారు. పాకిస్తానీయులు దీనిని గొప్పగా జరుపుకుంటున్నారు. కానీ వీరు గమనించని విషయం ఏంటంటే.. ఈ ఇద్దరూ చాలా ఏళ్లుగా IPLలో ఆడారు. గత సీజన్‌లో వారు బాగా ఆడకపోవడంతో వారిని రిలీజ్ చేశారు. వేలంలో తమను ఎవరూ తీసుకోరని తెలిసి అందుకే వారు IPLను కాదని PSL ఆడటానికి నిర్ణయం తీసుకున్నారు. డేవిడ్ వార్నర్ కూడా రిటైర్ అయిన తర్వాతే గత సీజన్‌లో PSLలో పాల్గొన్నారు.

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బోష్ గత సీజన్‌లో PSLలో పెషావర్ జల్మీ తరపున ఆడాడు. కానీ ముంబై ఇండియన్స్ అతనికి రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా అవకాశం ఇవ్వగానే, బోష్ వెంటనే PSLను వదిలి IPLలో ఆడటానికి వచ్చేశాడు. ఇది ఆటగాళ్లకు IPL ఎంత ముఖ్యమో తెలుపుతుంది.

స్టార్ ఆటగాళ్ల మొదటి ఎంపిక IPL మాత్రమే..
ప్రపంచంలోని టాప్-క్లాస్ T20 ఆటగాళ్లకు కూడా IPLనే తొలి ప్రాధాన్యత. టీ20 ఫార్మాట్‌లోని స్టార్ ఆటగాళ్లుగా పరిగణించబడే లసిత్ మలింగ, ఏబీ డివిలియర్స్, జోస్ బట్లర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్వింటన్ డి కాక్ వంటి వారు PSLలో అసలు ఆడలేదు లేదా చాలా తక్కువ సీజన్లలో ఆడారు. నికోలస్ పూరన్ PSLలో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. క్రిస్ గేల్, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావో వంటి టీ20 స్టార్ ఆటగాళ్లు కూడా PSLలో అతి తక్కువ మ్యాచ్‌లే ఆడారు. ఈ పరిస్థితి PSL, IPL కంటే ముందు ముగిసిపోయే సమయంలో ఉండేది. గత సీజన్ నుంచే రెండు లీగ్‌లు ఒకే సమయంలో జరుగుతున్నాయి.

Story first published: Thursday, December 11, 2025, 13:57 [IST]
Other articles published on Dec 11, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+