హైదరాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2019 సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను పీఎస్ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసింది. రాబోయే సీజన్లో 8 మ్యాచ్లను పాకిస్థాన్ వేదికగా నిర్వహించాలని... అదే విధంగా ఫైనల్ను కరాచీ వేదికగా మార్చి 17న నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఆసియా కప్: కోహ్లీ, యూనిస్ ఎలైట్ జాబితాలోకి ముష్ఫికర్ రహీమ్
పీఎస్ఎల్ నాలుగో సీజన్ ఫిబ్రవరి 14 నుంచి యూఏఈ వేదికగా ఆరంభం కానుంది. గత సీజన్లో టోర్నీ లీగ్ మ్యాచ్లను యూఏఈలో నిర్వహించిన బోర్డు... రెండు సెమీఫైనల్స్తో పాటు ఫైనల్ను కరాచీలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి అందుకు భిన్నంగా పాకిస్థాన్లో 8 మ్యాచ్లను నిర్వహించనుంది.
అయితే, ఈ నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రతినిధులతో పాటు పీఎస్ఎల్ ప్రాంఛైజీ యజమానులు లాహోర్లోని జాతీయ క్రికెట్ అకాడమీలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఇటీవలే పీసీబీ ఛైర్మన్గా ఎంపికైన ఇషాన్ మనీ నేతృత్వం వహించారు.
ఈ సమావేశంలో పీసీబీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా ఇషాన్ మనీ మాట్లాడుతూ "ఈ ప్రాజెక్టులో పీసీబీతో పాటు పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు భాగస్వామ్యం అయ్యాయి. రాబోయే సీజన్ కూడా విజయవంతం అవుతుందని నేను నమ్మకంగా ఉన్నా" అని అన్నాడు.
గత సీజన్ ర్యాంకుల ఆధారంగా పీఎస్ఎల్ 2019 సీజన్లో అన్ని ప్రాంఛైజీల డ్రాఫ్ట్ను రూపొందించారు. ఈ డ్రాఫ్ట్ ఆర్డర్ను అన్ని ప్రాంఛైజీలు తమ అంగీకారాన్ని తెలిపాయి.