
ఐసీసీ విచారణలో
అయితే, ఐసీసీ విచారణలో యాంటీ కరప్షన్ కోడ్లోని మూడు చార్జ్లను ఉల్లంఘించినట్లు షకీబ్ దర్యాప్తు అధికారుల ముందు అంగీకరించడంతో మంగళవారం షకీబ్కు శిక్షను ఖరారు చేసింది. దీంతో షకీబ్ వచ్చే ఐపీఎల్తో పాటు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్కప్కు దూరమయ్యాడు. షకీబ్పై నిషేధం బంగ్లాదేశ్లో చిచ్చు రేపింది.

నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలంటూ
అతడిపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. షకీబ్ సొంత గ్రామం మగురాలో దాదాపు 700 మంది అభిమానులు రాస్తారోకో చేపట్టారు. "షకీబ్పై విధించిన నిషేధం ఎత్తివేయాలంటూ నిరసనకారులు హైవేపై ర్యాలీ నిర్వహించారు" అని పోలీస్ ఛీప్ సైఫుల్ ఇస్లామ్ తెలిపారు.

ఐసీసీకి వ్యతిరేకంగా నినాదాలు
ఐసీసీకి వ్యతిరేకంగా వాళ్లు నినాదాలు చేశారు. షకీబ్పై కుట్ర చేసి నిషేధం విధించారని నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు దేశ రాజధాని ఢాకాలోనూ షకీబ్ అల్ హాసన్ అభిమానులు పెద్దఎత్తున రొడ్లపైకి వచ్చారు. కాగా, షకీబ్పై ఐసీసీ విధించిన వెంటనే అమల్లోకి వచ్చింది. దీంతో భారత పర్యటనకు దూరమయ్యాడు.

అక్టోబర్ 29, 2020తో ముగియనున్న నిషేధం
షకీబ్పై విధించిన నిషేధం అక్టోబర్ 29, 2020తో ముగియనుంది. మరోవైపు నిషేధం ఎదురుకుంటున్న షకీబ్కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అండగా నిలిచారు. ఆమె మాట్లాడుతూ "షకీబుల్ పొరపాటు చేశాడు. ఆ విషయాన్ని కూడా ఒప్పుకున్నాడు. ఐసీసీ నిర్ణయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం, క్రికెట్ బోర్డు ఏమి చేయలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. షకీబుల్ నిరాశ చెందకూడదు. ఇలాంటి సమయంలో షకీబుల్కు అండగా నిలవాలని బంగ్లా క్రికెట్ బోర్డుకు సూచిస్తున్నా" అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications












