హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్లో భాగంగా గురువారం తమిళ్ తలైవాస్తో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్, కుమార్తె సారాతో కలిసి వీక్షించాడు. ప్రొ కబడ్డీ ఐదో సీజన్లో సచిన్ హాజరైన రెండో మ్యాచ్ ఇది.
ఈ సీజన్ ప్రారంభంలో తెలుగు టైటాన్స్తో తమిళ్ తలైవాస్ జట్ల మధ్య హైదరాబాద్ జరిగిన మ్యాచ్కి హాజరైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో కూడా తమిళ్ తలైవాస్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, తాజా మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 33-28 తేడాతో తమిళ్ తలైవాస్పై నెగ్గింది.
ఈ మ్యాచ్తో ప్రో కబడ్డీ ఐదో సీజన్లో ముంబైలో నిర్వహించే మ్యాచ్లు ముగిశాయి. సెప్టెంబరు 1 నుంచి 7 వరకు కోల్కతా వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. కాగా, ప్రో కబడ్డీ లీగ్లో తమిళ్ తలైవాస్ జట్టుకి సచిన్ సహ యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే.

తలైవాస్ ముంబైలో ఆడుతున్న చివరి మ్యాచ్ కావడంతో సచిన్ ఈ మ్యాచ్కి హాజరయ్యాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లాడిన తమిళ్ తలైవాస్ ఒక్క విజయం మాత్రమే సాధించింది. ఐదు మ్యాచుల్లో ఓటమి పాలవగా, రెండు మ్యాచ్లను డ్రాగా ముగించింది.
దీంతో తెలుగు టైటాన్స్ 23 పాయింట్లతో జోన్-బిలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా, 10 మ్యాచ్ల్లో 15 పాయింట్లతో తలైవాస్ చివరి స్థానంలో కొనసాగుతోంది. జోన్-ఎలో భాగంగా జరిగిన జైపూర్ పింక్ పాంథర్స్తో జరిగిన మ్యాచ్లో యు ముంబా 35-32 తేడాతో విజయం సాధించింది.