ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టులో నలుగురు హాఫ్ సెంచరీలు
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టులో నలుగురు బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓపెనర్లు షార్ట్ 72, బ్రయాంట్ 64 పరుగులతో తొలి వికెట్కు 114 పరుగులు జోడించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆరోన్ హార్డీ 69 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.

మూడు వికెట్లు తీసిన షమీ
బౌలింగ్లో సైతం ఆరోన్ హార్డీ నాలుగు వికెట్లు తీశాడు. ఇక, భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ షమి మాత్రమే మూడు వికెట్లతో పర్వాలేదనిపించగా అశ్విన్, ఉమేష్ యాదవ్ చెరొక వికెట్ తీసుకున్నారు. వీరు కూడా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకోలేకపోయారు. ఇషాంత్ శర్మ, జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేదు.
ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఓపెనర్ పృథ్వీ షా
కాగా, ఈ మ్యాచ్ డ్రా అయ్యే విధంగా కనిపిస్తోంది. అయితే ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించాలని ఊవిళ్లూరుతోన్న టీమిండియాకు ఇది ఎదురదెబ్బే. అందుకు కారణం తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు ఆధిక్యం దిశగా దూసుకెళ్లడమే. కాగా, ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో అడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్టుకు అతడు దూరమయ్యాడు.


Click it and Unblock the Notifications












