ముంబై: ఈ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిరాశపరిచినందుకు ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా అభిమానులకు క్షమాపణ చెప్పారు. అభిమానులకు క్షమాపణ చెప్పడానికి ఆమె ట్విట్టర్ను ఎంచుకున్నారు.
తమ జట్టు చాలా చెత్తగా ఆడిందనే విషయాన్ని ఆమె అంగీకరించారు. త్వరలో తన జట్టు పుంజుకుంటుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
ఈ ఐపియల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 9 మ్యాచులు ఆడి కేవలం రెండు మాత్రమే గెలుచుకుంది. గత సీజన్లో ఫైనల్కు చేరుకున్న జట్టు ఈసారి ఇతర జట్లకు పోటీ కూడా ఇవ్వలేకపోతోంది.
అత్యంత దారుణంగా జట్టు ఆడిందని, భవిష్యత్తులో సంతోషానికి జట్టు అవకాశం ఇస్తుందనే ఆశ ఉందని ప్రీతి జింటా ట్విట్టర్లో రాశారు.