ఐపీఎల్ ఓ ఆటగాడి జీవితాన్ని ఎలా మారుస్తుందో చెప్పడానికి ప్రఫుల్ హింగే ఓ నిలువెత్తు నిదర్శనం. సోమవారం రాత్రి వరకు ప్రఫుల్ హింగే ఎవరో కూడా చాలా మందికి తెలియదు. విదర్భకు చెందిన ఈ 24 ఏళ్ల పేసర్ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తన బేస్ ధర రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి బెంచ్కే పరిమితమైన ప్రఫుల్ హింగేకు.. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. తన అద్భుత ప్రదర్శనతో కేవలం 6 బంతుల్లోనే ప్రపంచం మొత్తం తన పేరును వెతికేలా చేశాడు.
సోషల్ మీడియాలో సునామీ
ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శన అతని సోషల్ మీడియా ఖాతాపై పెను ప్రభావాన్ని చూపింది. బంతిని అందుకునే ముందు అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కేవలం 3,000 మాత్రమే. కానీ మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే అది ఏకంగా 1,61,000కి చేరుకుంది. అంటే దాదాపు 5000 శాతానికి పైగా పెరుగుదల కనిపించింది. అభిమానులు అతని ప్రొఫైల్ను లైకులు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఓ సాధారణ ఆటగాడు ఒకే ఓవర్తో గ్లోబల్ సెన్సేషన్గా మారడం ఐపీఎల్ పవర్ను మరోసారి నిరూపించింది.

చారిత్రాత్మక రికార్డు
ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలర్ చేయని అద్భుతాన్ని ప్రఫుల్ హింగే చేసి చూపించాడు. తన ఐపీఎల్ కెరీర్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి మొదటి బౌలర్గా రికార్డు సృష్టించాడు. రెండో బంతికే ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీని డకౌట్ చేసిన ప్రఫుల్ హింగే.. ఆ తర్వాత ధ్రువ్ జురేల్, లూహాన్-డ్రే ప్రిటోరియస్లను పెవిలియన్ పంపాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక్కసారిగా కోలుకోలేని దెబ్బ తింది. హింగే వేసిన ఆ ఓవర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన అరంగేట్ర ఓవర్గా నిలిచిపోయింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
ప్రఫుల్ హింగే విధ్వంసం అక్కడితో ఆగలేదు. తన రెండో ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ను కూడా ఔట్ చేసి.. కేవలం 12 బంతుల వ్యవధిలోనే 4 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 4/34 గణాంకాలతో సన్రైజర్స్ 57 పరుగుల భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. వేలంలో ఏ జట్టు పెద్దగా ఆసక్తి చూపని ఈ కుర్రాడు, నేడు ఐపీఎల్ సెన్సేషన్గా నిలవడం నిజంగా ఒక కలలాంటి వాస్తవం.