మిగతా మ్యాచ్లపై రెండు రోజుల్లో నిర్ణయం
ఈ సిరీస్లో ఇప్పటివరకు ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ముగిసింది. మరో రెండు వన్డే మ్యాచ్లతోపాటు టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ల నిర్వహణపై వెస్టిండీస్, ఐర్లాండ్ క్రికెట్ బోర్డులు మరో రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నాయి. ఐర్లాండ్ ఆటగాళ్లు ఆండ్రూ బల్బిర్నీ, వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్ గత వారమే కరోనా బారిన పడ్డారు. తాజాగా పాల్ స్టిర్లింగ్, సిమి సింగ్, బెన్ వైట్కు వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయింది. అంతేకాకుండా ఐర్లాండ్ హెడ్ కోచ్ డేవిడ్ రిప్లీ కూడా కరోనాతో చికిత్స పొందున్నారు. కాగా ఐర్లాండ్ స్పిన్ బౌలర్ ఆండీ మెక్బ్రైన్, ఫాస్ట్ బౌలర్ మార్క్ అడైర్ గాయాల బారిన పడ్డారు.
ఐర్లాండ్ను వదలని కరోనా
కరోనా కారణంగా ఐర్జాండ్ జట్టు యూఎస్ఏ పర్యటనను ఇప్పటికే రద్దు అయింది. అక్కడ కరోనా కేసులు భారీగా నమోదవడంతో సిరీస్ను వాయిదా వేశారు. అనంతరం యూఎస్ నుంచే ఐర్లాండ్ జట్టు నేరుగా వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరింది. అక్కడి నుంచి బయలుదేరే ముందే ఐర్లాండ్ జట్టులో కరోనా కలకలం రేపింది. ఆ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు. తాజాగా మళ్లీ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా ఐర్లాండ్ జట్టు ఎక్కడికెళ్లినా ఆ జట్టును కరోనా మహమ్మారి వదిలి పెట్టడం లేదు.
తొలి వన్డేలో విండీస్ విజయం
కాగా మూడు వన్డే సిరీస్లో భాగంగా ఇప్పటికే తొలి వన్డే మ్యాచ్ ముగిసింది. ఆ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 269 పరుగలకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్యాన్ని చేధించలేక ఐర్లాండ్ 245 పరుగులకే ఆలౌట్ అయింది.