న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఆడనున్న టీమిండియాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత జట్టులో ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్లు చేశారు. "2015 ప్రపంచ కప్ ఆరంభమవుతున్న నేపథ్యంలో భారత జట్టుకు నా శుభాకాంక్షలు. మనసు పెట్టి ఆడండి.... మళ్లీ కప్పుతో రండి" అని అన్నారు.

కెప్టెన్ ధోనికి ప్రత్యేకించి తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ధోని "బాగా ఆడు. జట్టును సమర్ధంగా నడిపించి దేశం గర్వపడేలా చేయి. నీ గురించి తెలుసు. నువ్వు చేయగలవు" అని ట్వీట్ చేశారు. మిగతా ఆటగాళ్లకు ప్రధాని మోడీ ఏ విధంగా ట్వీట్లు చేశారో చూద్దాం.