న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌ మాత్రమే ఆడతారు కానీ పీఎస్‌ఎల్‌ ఎందుకు ఆడరు.. పాక్‌ అభిమానికి దిమ్మతిరిగే పంచ్!!

Playing IPL but not PSL Why: James Neesham Shutdown Pakistan Fan

వెల్లింగ్టన్‌: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే క్రికెట్ ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ఇందులో మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు కూడా ఉన్నారు. టీమిండియా మాజీ ఓపెనర్లు వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంబీర్.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ.. పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఈ జాబితాలో న్యూజీలాండ్ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ ఉన్నాడు. అయితే జిమ్మీ ఎక్కువగా కాంట్రవర్సల్ పోస్టులతో 'ట్విట్టర్ స్టార్' అయ్యాడు. అయితే ఓ పాకిస్తాన్ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు తాజాగా నీషమ్‌ ఫన్నీ సమాధానం ఇచ్చాడు.

తాజాగా జేమ్స్‌ నీషమ్‌ను అలీ హైదర్‌ అనే పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమాని ఓ ప్రశ్న అడిగాడు. 'మీరు ఎందుకు ఐపీఎల్‌ మాత్రమే ఆడతారు.. పీఎస్‌ఎల్‌ ఎందుకు ఆడరు?' అని ప్రశ్నించాడు. అంతేకాదు 'మీకు ఐపీఎల్‌ డబ్బుతో పాటు ఫేమ్‌ను కూడా తెచ్చుపెడుతుంది. అందుకేనా ఐపీఎల్‌కు ప్రాధాన్యం ఇస్తారు' అని హైదర్‌ సెటైర్ వేశాడు. మాములుగా అయితే అభిమాని అడిగిన తరహాలోనే రిప్లైలు ఇవ్వడం నీషమ్ శైలి. కానీ ఇక్కడ ఎంతో ఓర్పుగా జవాబివ్వడం ప్రత్యేకం.

అలీ హైదర్ అడిగిన ప్రశ్నకు జేమ్స్ నీషమ్‌ అవుననే సమాధానాన్ని చెప్పకనే చెప్పాడు. 'దాంతో పాటు పీఎస్‌ఎల్‌ మా సమ్మర్‌ సీజన్‌లోనే ఆరంభమవడం కూడా కారణం కావొచ్చు కదా' అంటూ పాక్‌ అభిమానికి జిమ్మీ రిప్లై ఇచ్చాడు. అంటే పీఎస్‌ఎల్‌ జరిగే షెడ్యూల్‌ మారితే తాను ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు నీషమ్‌ బదులిచ్చాడు. దాంతో ఆ అభిమాని చేసేది లేక ఇక తిరిగి ఏమీ కౌంటర్‌ ఇవ్వలేకపోయాడు. అంతర్జాతీయ కెరీర్‌లో జిమ్మీ ఇప్పటివరకు 12 టెస్టుల్లో, 63 వన్డేల్లో, 18 టీ20 మ్యాచ్‌ల్లో కివీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం కివీస్ ఎలాంటి టోర్నీలు ఆడకపోవడంతో జిమ్మీ ఇంట్లోనే ఉంటున్నాడు.

ఈ ఏడాది జరుగనున్న ఐపీఎల్ 2020‌లో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున జేమ్స్ నీషమ్‌ ఆడనున్నాడు. గతేడాది చివర్లో జరిగిన వేలంలో నీషమ్‌ను 50 లక్షల రూపాయల కనీస ధరకు పంజాబ్‌ కొనుగోలు చేసింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున నీషమ్‌ ఆడాడు. ఈసారి పలువురు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌కు సిద్ధమయ్యారు. జిమ్మీ నీషమ్‌ (పంజాబ్), లూకీ ఫెర్గ్యూసన్‌ (కేకేఆర్)‌, మెక్‌లాన్‌గెన్ (ముంబై)‌, ట్రెంట్‌ బౌల్ట్‌ (ముంబై), కేన్‌ విలియమ్సన్‌ (సన్‌రైజర్స్)‌, మిచెల్‌ శాంట్నర్ (చెన్నై)కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

IPL 2020: డివిలియర్స్‌ ఈజ్‌ బ్యాక్‌.. భారీ షాట్లతో అలరించిన ఏబీ!!IPL 2020: డివిలియర్స్‌ ఈజ్‌ బ్యాక్‌.. భారీ షాట్లతో అలరించిన ఏబీ!!

Story first published: Monday, August 31, 2020, 18:02 [IST]
Other articles published on Aug 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X