
టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసింది మనోడే
ఈ ఏడాది టెస్టు క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసిన ఘనత టీమిండియా ఆటగాడికే దక్కింది. భారత జట్టు సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ రికార్డును దక్కించుకున్నాడు. ఈ ఏడాది మొత్తంలో 8 టెస్టు మ్యాచ్లు ఆడిన అశ్విన్.. 16 ఇన్నింగ్స్ల్లో 52 వికెట్లు పడగొట్టాడు. ఓ ఇన్నింగ్స్లో అత్యధికంగా 6 వికెట్లు పడగొడితే.. మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 365.1 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్.. కేవలం 2.31 ఏకానమీతో 844 పరుగులు ఇచ్చాడు. 78 ఓవర్లను మెయిడిన్గా వేశాడు. ఇక అశ్విన్ తర్వాత రెండో స్థానంలో పాకిస్థాన్ బౌలర్ షాహిన్ షా ఆఫ్రిదీ ఉన్నాడు. అతను 9 టెస్టు మ్యాచ్ల్లో 47 వికెట్లు తీశాడు. ఇక నాలుగో స్థానంలో మరో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ ఉన్నాడు. అతడు 5 మ్యాచ్ల్లో 36 వికెట్లు పడగొట్టాడు.

వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీసింది వీరే
ఇక వన్డేల విషయానికి వస్తే శ్రీలంక బౌలర్ పీవీడీ చమీర ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 14 మ్యాచ్లు ఆడిన చమీర 20 వికెట్లు తీశాడు. అతని తర్వాత రెండో స్థానంలో ఐర్లాండ్ ఆటగాడు సిమి సింగ్ ఉన్నాడు. సిమి.. 13 మ్యాచ్ల్లో 19 వికెట్లు తీశాడు. మూడో స్థానంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తిఫిజర్ రహమాన్ ఉన్నాడు. రహమాన్ 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు తీశాడు.

టీ20ల్లో ఎక్కువ వికెట్ల జాబితా ఇదిగో
ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా శ్రీలంకకు చెందిన డి సిల్వా మొదటి స్థానంలో నిలిచాడు. సిల్వా 20 మ్యాచ్ల్లో 36 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతి ప్లేసులో సౌతాఫ్రికాకు చెందిన షంసీ ఉన్నాడు. షంసీ కూడా 22 మ్యాచ్ల్లో 36 వికెట్లు పడగొట్టాడు. మూడో స్థానంలో ఉగాండ జట్టుకు చెందిన నక్రాణి ఉన్నాడు. అతడు 22 మ్యాచ్ల్లో 35 వికెట్లు పడగొట్టాడు.


Click it and Unblock the Notifications
