మరో రెండు వారాల్లో భారత అంతర్జాతీయ క్రికెటర్లు భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ)లో భాగస్వాములు కానున్నారు. ఈ దిశగా బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) చర్యలు చేపట్టింది. అయితే ఐసీఏ.. అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్ఐసీఏ)లో భాగం కాదని తెలుస్తోంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ప్రపంచ క్రికెట్ దేశాల్లో ఆటగాళ్ల కోసం ప్రత్యేక సంఘాలు ఉన్నాయి. భారత్లో మాత్రం ప్రత్యేక సంఘాలు అంటూ ఏమీలేవు. ఈ నేపథ్యంలో లోధా కమిటీ సిఫారుసుల అమలుతో భారత్లోనూ క్రికెట్ సంఘం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఆరంభమమైంది. మరో రెండు వారాల్లో ఆ పని పూర్తవుతుంది.
'భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే ఈ పేరుతో ఇంకేదైనా సంఘం ఉందేమో చెక్ చేయాలి. పేరు ఏదైనా.. ముందు ఈ సంఘం రిజిస్టర్ కావాలి. అనంతరం పురుషులు, మహిళల సంఘాలకు నామినీలను నియమించాలి' అని సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు.