
టెస్టు క్రికెట్పై కోహ్లీ
"ఇది వారి కెరీర్కు ఎంతమాత్రం మంచిది కాదు. ఇలా చేస్తే ఒత్తిడి ఎదుర్కోలేక మానసిక సమస్యలు తప్పవు. ఏదో రెండు గంటలు ఆడటం, కొన్ని ఓవర్లు వేయటం ఆటను ముగించడం సరైన పద్ధతి కానేకాదు. కుర్రాళ్లు అసలైన టెస్టు మజాకు అలవాటు పడాలి. మన విజన్ను బట్టి అభిమానులుంటారు. టెస్టుల్ని ఆసక్తికరంగా ఆడితే తప్పకుండా ప్రేక్షకులు పెరుగుతారు" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

తమ జట్టు తిరుగులేని శక్తిగా
టెస్టు క్రికెట్లో తమ జట్టు తిరుగులేని శక్తిగా అవతరించాలన్న తన కోరికను కోహ్లీ మరోసారి వెల్లడించాడు. "భారతీయులు విశ్వవ్యాప్తంగా ఉన్నారు. ఇదే మన బలం. ఐదు రోజుల ఆటను గౌరవిస్తే, మనం టెస్టుల్ని శాసిస్తే, సంప్రదాయ క్రికెట్ అగ్రస్థానంలో ఉంటుంది. కానీ రానున్న సంవత్సరాల్లో భారత్ టెస్టు క్రికెట్లో గొప్ప శక్తిగా నిలవాలని బలంగా కోరుకుంటున్నాం. అందుకోసం ప్రయత్నస్తున్నాం" అని అన్నాడు.

నా పనిని శాస్త్రి మరింత తేలిక చేస్తున్నాడు
ఇక, కెప్టెన్గా తన పనిని కోచ్ రవిశాస్త్రి మరింత తేలిక చేస్తున్నాడని కోహ్లి చెప్పాడు. ‘‘రవిశాస్త్రి నాతో తన అభిప్రాయాన్ని నిజాయితీగా చెబుతాడు. ఓ ఘటన నాకింగా గుర్తుంది. గతేడాది ఇంగ్లాండ్లో ఓ టెస్టులో సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించా. అప్పుడు రవిశాస్త్రి నాతో మాట్లాడాడు" అని కోహ్లీ వివరించాడు.

అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టాలో
‘బ్యాటింగ్కు సంబంధించి నీతో ఏమీ మాట్లాడను. కారణం.. నాతో పాటు ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఆడావు. కానీ కెప్టెన్గా ‘ఈ జట్టు నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టాలో, మంచి వ్యూహ రచన ఎలా చేయాలో ఆలోచించు' అని అన్నాడు. శాస్త్రి మాటలపై ఆలోచించా. ‘కెప్టెన్సీ అంటే నువ్వు అనుకుంటున్నదాని కంటే ఎక్కువ' అని అతడు అన్నట్లు అనిపించింది'' అని కోహ్లీ అన్నాడు.


Click it and Unblock the Notifications













