అమాంతం గాల్లోకి ఎగిరిన తైజుల్
అదే సమయంలో ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న తైజుల్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్యాచ్ కోహ్లీని సైతం షాక్కు గురి చేసింది. దీంతో చేసేదేమీ లేక కోహ్లీ భారంగా పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కోహ్లీ ఔటైన తర్వాత
కోహ్లీ ఔటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. వరుస ఓవర్లలో అశ్విన్ (9), ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు డకౌటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన షమీ సిక్సర్, ఫోర్తో పది పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ 347/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.

347/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
టీమిండియా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే సమయానికి వృద్ధిమాన్ సాహా (17), మహ్మద్ షమి (10) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్ హొసైన్, ఇబాదత్ హొసైన్లు చెరో మూడు వికెట్లు తీయగా, అబు జాయెద్ రెండు, తైజుల్ ఇస్లాంకు ఒక వికెట్ లభించింది.


Click it and Unblock the Notifications
