
మహ్మదుల్లా వికెట్ తీసిన ఆనందంలో ఇషాంత్ శర్మ
ఉప్పల్ స్టేడియంలో బంగ్లా క్రికెటర్ మహ్మదుల్లా వికెట్ తీసిన ఆనందంలో టీమిండియా ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, కెప్టెన్ కోహ్లీ, కేఎల్ రాహుల్.

ఆనందంలో ఇషాంత్ పైకి ఎక్కిన ఓపెనర్ కేఎల్ రాహుల్
ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో ఏకైక టెస్టు మ్యాచ్లో బంగ్లా క్రికెటర్ మహ్మదుల్లా వికెట్ తీసిన అనంతరం ఇషాంత్ పైకి ఎక్కిన ఓపెనర్ కేఎల్ రాహుల్.

కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ వికెట్ తీసిన అశ్విన్
ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆఖరి రోజైన సోమవారం బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ వికెట్ తీసిన అశ్విన్. అనంతరం అశ్విన్ను అభినందిస్తున్న టీమిండియా ఆటగాళ్లు.

గ్రూప్ ఫోటోకి ఫోజిచ్చిన టీమిండియా
ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో ఏకైక టెస్టు మ్యాచ్ అనంతరం సపోర్టింగ్ స్టాప్తో కలిసి గ్రూప్ ఫోటోకి ఫోజిచ్చిన టీమిండియా ఆటగాళ్లు.

ఉప్పల్ స్టేడియంలోని ప్రేక్షకులకు కెప్టెన్ కోహ్లీ అభివాదం
459 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన బంగ్లాదేశ్ 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 208 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా విజయానంతరం ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న కెప్టెన్ కోహ్లీ.

విన్నింగ్ ట్రోఫీతో కెప్టెన్ కోహ్లీ
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన కెప్టెన్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 240 బంతుల్లో కోహ్లీ 204 పరుగుల చేశాడు. ఇందులో 24 ఫోర్లున్నాయి.

విన్నర్స్ టీమిండియా
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బంగ్లాదేశ్పై 208 పరుగుల తేడాతో విజయం సాధించిన అనంతరం ట్రోఫీతో ఫోటోకు ఫోజిలిచ్చిన టీమిండియా ఆటగాళ్లు.


Click it and Unblock the Notifications











