For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్మానించిన మోడీ, సానియాకు షేక్ హ్యాండ్ (ఫోటోలు)

By Nageswara Rao

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన 17వ ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఘనంగా సత్కరించారు. ఇంచియాన్‌లో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగిన క్రీడల్లో భారత్‌ మొత్తం 57 పతకాలను(11 బంగారు, 10 రజతం, 36 కాంస్యం) సాధించింది.

దేశానికి పతకాలు సాధించి.. దేశం గర్వించేలా చేసిన క్రీడాకారుల సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. వారితో దిగిన కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ దేశంలో క్రీడా రంగాన్ని ప్రొత్సహించేందుకు భారత క్రీడాకారులు వద్ద నుంచి సలహాలు, సూచలను తీసుకున్నారు. క్రీడాకారులు ఏ సమయంలోనైనా తనతో మాట్లాడాలనుకుంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చునని అన్నారు.

అంతక ముందు రోజు న్యూఢిల్లీ వేదికగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆసియా గేమ్స్ బంగారు పతక విజేతలు యోగేశ్వర్ దత్, సానియా మిర్జా, మేరీ కోమ్, భారత పురుషులు, భారత మహిళల కబడ్డీ జట్లు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులకు మంత్రి శర్బానంద సోనోవాల్ నగదు పురస్కారాలను అందజేశారు.

ఈ సందర్బంలో మంత్రి మాట్లాడుతూ తమ అథ్లెట్లు సాధించిన ఘనత ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తుందని అన్నారు. 16 ఏళ్ల తర్వాత బంగారు పతకాన్ని గెలిచిన భారత హాకీ జట్టుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

 ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఢిల్లీలో జరిగిన కార్యక్రంలో ప్రధాని నరేంద్రమోడీతో భారతీయ బాక్సర్లు. చిత్రంలో క్రీడల మంత్రి సరబానంద సోనోవాల్. బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించిన మేరీ కోమ్‌ ను చిత్రంలో చూడొచ్చు.

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఢిల్లీలో జరిగిన కార్యక్రంలో ప్రధాని నరేంద్రమోడీతో భారత టెన్నిస్ ప్లేయర్లు. చిత్రంలో క్రీడల మంత్రి సరబానంద సోనోవాల్. సానియా మిర్జా కూడా ఈ చిత్రంలో చూడొచ్చు.

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఢిల్లీలో జరిగిన కార్యక్రంలో ప్రధాని నరేంద్రమోడీతో భారత షూటర్లు. చిత్రంలో క్రీడల మంత్రి సరబానంద సోనోవాల్.

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఢిల్లీలో జరిగిన కార్యక్రంలో ప్రధాని నరేంద్రమోడీతో భారత రెజర్లు. చిత్రంలో క్రీడల మంత్రి సరబానంద సోనోవాల్. బంగారు పతకం సాధించిన యోగేశ్వర్ దత్ చిత్రంలో ఉన్నారు.

 ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఢిల్లీలో జరిగిన కార్యక్రంలో ప్రధాని నరేంద్రమోడీతో భారత స్విమ్మర్లు. చిత్రంలో క్రీడల మంత్రి సరబానంద సోనోవాల్.

 ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఢిల్లీలో జరిగిన కార్యక్రంలో ప్రధాని నరేంద్రమోడీతో భారత మహిళల కబడ్డీ జట్టు. చిత్రంలో క్రీడల మంత్రి సరబానంద సోనోవాల్.

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఢిల్లీలో జరిగిన కార్యక్రంలో ప్రధాని నరేంద్రమోడీతో భారత పురుషుల కబడ్డీ జట్టు. చిత్రంలో క్రీడల మంత్రి సరబానంద సోనోవాల్.

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఢిల్లీలో జరిగిన కార్యక్రంలో ప్రధాని నరేంద్రమోడీతో భారత రోయింగ్ జట్టు. చిత్రంలో క్రీడల మంత్రి సరబానంద సోనోవాల్.

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన 17వ ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఘనంగా సత్కరించారు.

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

దేశానికి పతకాలు సాధించి.. దేశం గర్వించేలా చేసిన క్రీడాకారుల సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. వారితో దిగిన కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ దేశంలో క్రీడా రంగాన్ని ప్రొత్సహించేందుకు భారత క్రీడాకారులు వద్ద నుంచి సలహాలు, సూచలను తీసుకున్నారు. క్రీడాకారులు ఏ సమయంలోనైనా తనతో మాట్లాడాలనుకుంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చునని అన్నారు.

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

ఆసియా గేమ్స్ పతక విజేతలను సన్మానించిన ప్రధాని మోడీ

కార్యక్రమంలో భాగంగా ఆసియా గేమ్స్ పతక విజేతలకు షేక్ హ్యాండ్స్ ఇస్తున్న ప్రధాని నరేంద్రమోడీ.

'రజతం, కాంస్యం సాధించిన వారు రియో ఒలింపిక్స్‌లో స్వర్ణంపై దృష్టిపెట్టాలి. హాకీలో స్వర్ణం గెలవడం ఆటకు కొత్త ఊపిరి పోసింది. దేశం మొత్తం గర్వపడుతోంది' అని అన్నారు. అథ్లెట్ల భవిష్యత్ శిక్షణ కార్యక్రమాలకు మరింత చేయూతనిస్తామని సోనోవాల్ హామీ ఇచ్చారు. స్వర్ణ విజేతలకు రూ. 20 లక్షలు, రజతానికి రూ. 10 లక్షలు, కాంస్యానికి రూ. 6 లక్షలు అందజేశారు. మిక్స్డ్‌డ్ డబుల్స్ సాకేత్‌‌తో కలిసి స్వర్ణం, డబుల్స్‌లో ప్రార్దన తోంబ్రేతో కలిసి కాంస్యం నెగ్గిన సానిమా మిర్జా రూ. 26 లక్షలు అందుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+