
అజింక్యా రహానే
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన అనంతరం రహానే మాట్లాడాడు. తొలి టెస్టులో త్వరగా పెవిలియన్ చేరడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని తెలిపాడు.

అజింక్యా రహానే
అప్పుడే ఇలా జరగకుండా చూసుకోవాలని భావించానని చెప్పాడు. అందుకే భారీ షాట్లపై దృష్టి పెట్టకుండా ఫుట్ వర్క్ మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టానని తెలిపాడు.

అజింక్యా రహానే
విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని రహానే కితాబిచ్చాడు. దీంతో సాహా అవుటయ్యాడని, అనంతరం లోయర్ ఆర్డర్తో కలిసి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భావించానన్నాడు.

అజింక్యా రహానే
తొలి టెస్టులో విరాట్ కోహ్లీకి జతగా అశ్విన్ సెంచరీతో భారీ స్కోరు సాధనలో భాగం కాగా, రెండో టెస్టులో కేఎల్ రాహుల్ చేసిన భారీ స్కోరుకి రహానే చేసిన సెంచరీ (108) దోహదపడింది.

అజింక్యా రహానే
దీంతో టీమిండియా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లోనే 300 పైచిలుకు పరుగుల ఆధిక్యాన్ని వెస్టిండీస్ ముందు ఉంచింది.


Click it and Unblock the Notifications











