For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదేసిన ఆర్ష్‌దీప్.. చివరలో రాజస్థాన్ జోరుకు కళ్లెం! సిక్సులతో రెచ్చిపోయిన మహిపాల్! పంజాబ్ లక్ష్యం ఎంతంటే?

PBKS vs RR: Rajasthan finish with 185 despite Arshdeep Singh five-fer, Mahipal Lomror hits 4 sixes

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశలో భాగంగా దుబాయ్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లన్నీ కోల్పోయి 185 పరుగులు చేసింది. దాంతో పంజాబ్ ముందు 186 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరలో పంజాబ్ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో రాజస్థాన్ జోరుకు కళ్లెం వేశాడు. లేదంటే సంజుసేన 200 పరుగులకు పైగా చేసేదే. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (49; 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు), ఎవిన్ లూయిస్ (36; 21 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టగా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ మహిపాల్ లోమ్రర్ (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) సిక్సుల వర్షం కురిపించాడు. పంజాబ్ బౌలర్లలో ఆర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. మొహ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు.ఇషాన్ పోరెల్, హర్‌ప్రీత్ బ్రార్ చెరో వికెట్ తీసుకున్నారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు​కు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఎవిన్​ లూయిస్, యశస్వి జైస్వాల్​ అదరగొట్టారు. ఇద్దరూ చెత్త బంతులను బౌండరీలకు పంపిస్తూ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే తొలి వికెట్​కు 54 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే దూకుడుగా ఆడుతున్న లూయిస్​.. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్లో మయాంక్‌ అగర్వాల్‌కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ సంజు శాంసన్‌ (4) రెండో వికెట్​గా వెనుదిరిగాడు. ఇషాన్‌ పొరెల్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో తొలి బంతికి రాహుల్‌కు క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు.

సంజు శాంసన్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన హిట్టర్ లియామ్​ లివింగ్​స్టోన్​ తన వంతుగా 17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 25 పరుగులు చేశాడు. చివరకు అర్షదీప్​ బౌలింగ్​లో పెవిలియన్​ చేరాడు. ఇక నిలకడగా ఆడుతున్న యశస్వి జైస్వాల్​ను హర్​ప్రీత్​ బ్రార్​ పెవిలియన్ చేర్చడంతో రాజస్థాన్ నాలుగో వికెట్​ కోల్పోయింది​. దాంతో అతడు తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ఆ తర్వాత క్రీజులోకి మహిపాల్ లోమ్రర్ ధనాధన్ బ్యాటింగ్​తో స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలోనే ఐదో వికెట్​గా రియాన్​ పరాగ్​ (4).. మహమ్మద్‌ షమీ వేసిన 17వ ఓవర్లో ఔట్ అయ్యాడు. కాసేపటికే మహిపాల్‌ను అర్ష్‌దీప్‌ బుట్టలో వేసుకున్నాడు. దాంతో రాజస్థాన్ కీలక వికెట్ కోల్పోయింది.

మహిపాల్‌ వికెట్ అనంతరం రాజస్థాన్ ఎక్కువగా పరుగులు చేయలేదు. 18వ ఓవర్లో రాహుల్​ తెవాతియా (2), క్రిస్​ మోరిస్ ​(5) వరుసగా వెనుదిరిగాడు. భారీ అంచనాలు పెట్టుకున్న మోరిస్ పూర్తిగా విఫలమయ్యాడు. చివర్లో వచ్చిన చేతన్​ సకారియా (7), కార్తిక్​ త్యాగీ (1) వేగంగా ఆడలేకపోయారు. ముస్తాఫిజుర్​ రెహ్మన్​ నాటౌట్​గా నిలిచాడు. చివరలో పంజాబ్ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో రాజస్థాన్ జోరుకు కళ్లెం వేశాడు. లేదంటే సంజుసేన 200 పరుగులకు పైగా చేసేదే.

Story first published: Tuesday, September 21, 2021, 21:57 [IST]
Other articles published on Sep 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+