హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హైదరాబాద్లో సందడి చేశాడు. బంగ్లాదేశ్తో జరిగే ఏకైక టెస్టు కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న కోహ్లీ, తన తోటి క్రికెటర్లు కేఎల్ రాహుల్, పాండ్యా, జయంత్ యాదవ్తో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. సహచరులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశానని, హైదరాబాద్లో ఈ ఉదయం ఎంతో బాగుందని కోహ్లీ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జయంత్ యాదవ్తో పాటు అభిమానులందరికీ ఈ రోజు శుభదినం కావాలని కోరుకుంటున్నట్లు కోహ్లీ ట్వీట్ చేశాడు.