Pakistan: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పాకిస్థాన్ కు చెందిన ఇమామ్-ఉల్-హక్ నిలిచాడు. ఇమామ్ ఒక్కో పరుగుకు రూ.3 లక్షలు సంపాదించాడు. ఇమామ్-ఉల్-హక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం లాంటి పెద్ద ప్లేయర్ కూడా కాదు. గాయపడిన ఫఖర్ జమాన్ స్థానంలో ఇమామ్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇమామ్-ఉల్-హక్ భారత్ పై కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతనికి రూ.30 లక్షలు ఇచ్చింది. ఈ విధంగా ఇమామ్-ఉల్-హక్ ఒక్కో పరుగులు రూ.3 లక్షలు సంపాదించినట్లు అయింది.
10 పరుగులు మాత్రమే చేసిన ఇమామ్..
మీడియా నివేదికల ప్రకారం.. ఇమామ్-ఉల్-హక్ సాధించిన రన్స్ ఆధారంగా అత్యంత ఖరీదైన ఆటగాడిగా పరిగణించబడ్డాడు. గాయపడిన ఫఖర్ జమాన్ స్థానంలో ఇమామ్ ను భారత జట్టుతో జరిగిన రెండో మ్యాచ్ కు జట్టులో చేర్చారు. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇమామ్ కు రూ.30 లక్షలు చెల్లించింది. భారత్ తో జరిగిన మ్యాచ్ లో అతను కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పాకిస్థాన్ చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. ఈ విధంగా ఇమామ్ టోర్నమెంట్ లో ఒక్కో రన్ కు రూ.3 లక్షలు సంపాదించాడు.

ఇప్పటివరకు 61 పరుగులు చేసిన రోహిత్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు పరుగుకు దాదాపు రూ.19,672 సంపాదించాడు. రోహిత్ 2 మ్యాచ్ లకు గానూ రూ. 12లక్షలు(ఒక మ్యాచ్ కు రూ.6లక్షలు) పొందుతాడు. ఈ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 61 పరుగులు చేశాడు. దాని ప్రకారం ఒక్కో పరుగుకు రూ.19 వేలకు పైగా పొందుతాడు. ఇదిలా ఉండగా.. తొడ కండరాల గాయం నుంచి కోలుకోవడానికి భారత కెప్టెన్ న్యూజిలాండ్ తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ ఆడకపోవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ ఆదివారం(మార్చి 2) రోజున దుబాయ్ లో జరగనుంది. న్యూజిలాండ్, భారత్ లు ఇప్పటికే సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి.
Nostalgia watching Imam ul-Haq getting run out on an absolutely pointless attempted run. Way more athletic than his uncle, but same result pic.twitter.com/KTQDKlfhMH
— Paul N Savio (@paulnsavio) February 23, 2025
122 పరుగులు చేసి కోహ్లీ
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కో పరుగుకు దాదాపు రూ.9,806 పొందుతాడు. కోహ్లీ 2 మ్యాచ్ లలో 122 పరుగులు చేశాడు. కోహహ్లీకి రూ.12 లక్షల వేతనం లభిస్తుంది. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం తన దేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లలో ఒకరు. బాబర్ ఆజం రూ.45 లక్షల జీతం సంపాదిస్తున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో బాబర్ ఒక్కో పరుగుకు దాదాపు లక్ష రూపాయలు పొందుతాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ తన రెండు మ్యాచ్ లలో 87 పరుగులు చేశాడు. బాబర్ కు పీసీబీ రూ.90 లక్షలు చెల్లించింది.