న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-పాక్ వన్డే సిరిస్‌పై ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్!

 Pakistan womens tour of India could be cancelled: PCB official

హైదరాబాద్: ఐసీసీ మహిళా ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌లో పాక్ మహిళా జట్టు పర్యటన రద్దయ్యే అవకాశం ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత పర్యటనలో భాగంగా పాక్ మహిళల జట్టు ఈ ఏడాది నవంబర్‌లో మూడు వన్డేల సిరిస్ ఆడాల్సి ఉంది.

ఇప్పుడు ఆ పర్యటనను భారత్‌ రద్దు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ రద్దయ్యే అవకాశం ఉందని పీసీబీ అధికారులు చెబుతున్నారు.

భారత్ vs దక్షిణాఫ్రికా 2019: కోహ్లీ, రోహిత్ శర్మ బద్దలు కొట్టబోయే రికార్డులివే!భారత్ vs దక్షిణాఫ్రికా 2019: కోహ్లీ, రోహిత్ శర్మ బద్దలు కొట్టబోయే రికార్డులివే!

ఈ సందర్భంలో ఓ పీసీబీ అధికారి మాట్లాడుతూ "పాక్ మహిళా జట్టు భారత పర్యటన కోసం బీసీసీఐ స్పందన కోసం ఎదురుచూస్తున్నాం. ఈ సిరిస్‌కు ఆతిథ్యం ఇచ్చేలా కనిపించడం లేదు. దీంతో సిరీస్‌ రద్దు అయ్యే అవకాశం ఉంది" అని అన్నారు. మరోవైపు భారత్‌లో పాక్ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని బోర్డు పేర్కొంది.

రష్యాలో వింత: 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుగా AK-47 రైఫిల్రష్యాలో వింత: 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుగా AK-47 రైఫిల్

"కేంద్రం ఆదేశాల మేరకు మేం నిర్ణయాలు తీసుకుంటాం. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు బీసీసీఐ ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకోలేదు. ప్రభుత్వ ఆదేశాలనుసారంగా నడుచుకుంటాం" అని ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Story first published: Friday, September 13, 2019, 19:01 [IST]
Other articles published on Sep 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X