
20 పరుగుల తేడాతో పాక్ విజయం
లాహోర్లోని గడాఫీ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20లో 20 పరుగుల తేడాతో వరల్డ్ ఎలెవన్ను పాకిస్థాన్ ఓడించింది. టాస్ గెలిచిన వరల్డ్ ఎలెవెన్ కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది.

బాబర్ అజామ్ అద్భుత ప్రదర్శన
పాక్ ఆటగాళ్లలో బాబర్ అజామ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 52 బంతుల్లో 86 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. షోయబ్ మాలిక్ (38), అహ్మద్ షెజాద్ (39) మెరిశారు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (4) పరుగులతో నిరాశపరిచినా చివర్లో ఇమాద్ వసీం (15 నాటౌట్) భారీ సిక్సర్లు బాదాడు.

7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసిన వరల్డ్ ఎలెవన్
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన వరల్డ్ ఎలెవన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులే చేసింది. వరల్డ్ ఎలెవన్ బ్యాట్స్మెన్లలో ఆమ్లా (26), టిమ్ పైన్ (25), డుప్లెసిస్ (29) ఇన్నింగ్స్లను బాగానే ఆరంభించినా ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన వారు పెద్దగా రాణించలేదు.

అజామ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
చివర్లో డారెన్ సామి (29 నాటౌట్) పోరాడినప్పటికీ జట్టు ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. పాక్ బౌలర్లలో సోహైల్ ఖాన్, రయీస్, షాదాబ్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు. అజామ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. మూడు టీ20ల సిరీస్లో మిగతా రెండు మ్యాచ్లు బుధ, గురువారాల్లో జరగనున్నాయి.


Click it and Unblock the Notifications











