
అజహర్ అలీ సెంచరీ
ఓవర్నైట్ స్కోరు 57/0తో పాకిస్తాన్ శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించగా.. మసూద్, అబిద్ మొదటి వికెట్కు 278 పరుగులు జోడించి పటిష్ఠ స్థితిలో నిలిపారు. నాలుగో రోజు ఆటగాలో అజహర్ అలీ సెంచరీ (103 బ్యాటింగ్; 11 ఫోర్లు) చేసాడు. మరోవైపు బాబర్ ఆజమ్ (56 బ్యాటింగ్; 4 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీ చేసాడు. ప్రస్తుతం పాక్ 398 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో పాక్ 191 పరుగులు చేయగా.. లంక 271 పరుగులు చేసింది.

తొలి పాకిస్థాన్ బ్యాట్స్మన్గా అబిద్ రికార్డు
32 ఏళ్ల లేటు వయసులో టెస్టుల్లో అడుగుపెట్టిన అబిద్ అలీ తాజా సెంచరీతో మరో రికార్డు సృష్టించాడు. ఆడిన తొలి వన్డే, టెస్ట్లో సెంచరీలు సాధించిన క్రికెటర్గా ఇప్పటికే రికార్డు నెలకొల్పిన అలీ.. ఆడిన మొదటి రెండు టెస్ట్ల్లో సెంచరీలు చేసిన తొలి పాకిస్థాన్ బ్యాట్స్మన్గా రికార్డుల్లో నిలిచాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్గా నిలిచాడు. శ్రీలంకతో రావల్పిండిలో డ్రా అయిన మొదటి టెస్ట్లో అరంగేట్రం చేసిన అబిద్ సెంచరీ (109) చేసిన సంగతి తెలిసిందే. గత మార్చిలో దుబాయ్లో ఆస్ట్రేలియాపై తన తొలి వన్డేలోనే సెంచరీ (112) చేసాడు.

రెండో అత్యుత్తమ భాగస్వామ్యం
అబిద్, మసూద్ పాక్ జట్టుకు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరు శ్రీలంక బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 278 పరుగులు జోడించారు. పాకిస్తాన్కు టెస్టుల్లో తొలి వికెట్కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. అమీర్ సోహైల్-ఇజాజ్ అహ్మద్ (1997) జోడీ ఇదే మైదానంలో వెస్టిండీస్పై నెలకొల్పిన 298 పరుగుల భాగస్వామ్యం తొలి స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications












