టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ జట్టులో మహ్మద్ రిజ్వాన్ (26), ఆసిఫ్ అలీ (25), బాబర్ అజామ్ (23) రాణించడంతో మొదట పాకిస్థాన్ 9 వికెట్లకు 168 పరుగులు చేసింది. సఫారీ జట్టులో బ్యూరాన్ హెం డ్రిక్స్ (4/14) అద్భుతమైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు.
141 పరుగులు చేసి ఓడిన సఫారీలు
అనంతరం దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసి ఓడిపోయింది. సఫారీ జట్టులో క్రిస్ మోరిస్ (29 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, వాన్ డర్ డసెన్ (35 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫరవాలేదనిపించాడు.
డేవిడ్ మిల్లర్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు
పాక్ బౌలర్లలో ఆమిర్ 3 వికెట్లు పడగొట్టగా... షాదాబ్, అష్రఫ్ చెరో 2 వికెట్లు తీశారు. బ్యాటింగ్లో చివరి ఓవర్లో మూడు భారీ సిక్సర్లు బాదడంతో పాటు 2 కీలక వికెట్లు తీసిన షాదాబ్ ఖాన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కగా, డేవిడ్ మిల్లర్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా ఎంపికయ్యాడు.