పాక్ జట్టు
కొన్ని రోజులుగా కొనసాగిన అనిశ్చితి వీడటంతో ట్వంటీ20 ప్రపంచ కప్లో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్లో అడుగు పెట్టింది.
పాక్ జట్టు
27 మందితో కూడిన పాక్ క్రికెట్ బృందం అబుదాబి నుంచి శనివారం రాత్రి కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెట్టింది.
పాక్ జట్టు
భారత్లో భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయని ఆరోపించడంతో పాక్ ఆటగాళ్లను రెండు బస్సుల ద్వారా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో వారు బస చేసే హోటల్కు తరలించారు.
పాక్ జట్టు
వందలాది సిఐఎస్ఎఫ్ సిబ్బందితో పాటు బ్లాక్ కమెండోస్ రక్షణగా వారికి ఉన్నారు. అయితే విమానాశ్రయం నుంచి వెలుపలకి వచ్చిన పాక్ క్రికెటర్లకు భారత అభిమానుల నుంచి ఘనమైన స్వాగతం లభించింది.
పాక్ జట్టు
అఫ్రీది బృందాన్ని చప్పట్లతో భారత్ అభిమానులు స్వాగతించారు. ఆటగాళ్లు వారికి చేతులు ఊపుతు వెళ్లారు. సోమవారం ఈ జట్టు శ్రీలంకతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది.
పాక్ జట్టు
ట్వంటీ 20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు శనివారం భారత్కు శనివారం రాత్రి వచ్చింది. అనేక రోజుల అనిశ్చితికి తెరదించుతూ భారత్కు వెళ్లేందుకు పాక్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అబుదాబి నుంచి వచ్చిన 27 మంది సభ్యుల పాకిస్థాన్ బృందం రాత్రి 8 గంటలకు కోల్కతాలోని నేతాజి సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో దిగింది.
పాక్ ఉమెన్ క్రికెట్ జట్టు
పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కూడా భారత్ వచ్చింది. శనివారం వారు చెన్నై విమానాశ్రయంలో దిగారు. వీరు మహిళా ట్వంటీ 20 ప్రపంచ కప్ కోసం వచ్చారు.
పాక్ ఉమెన్ క్రికెట్ జట్టు
పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కూడా భారత్ వచ్చింది. శనివారం వారు చెన్నై విమానాశ్రయంలో దిగారు. వీరు మహిళా ట్వంటీ 20 ప్రపంచ కప్ కోసం వచ్చారు. మహిళా జట్టు కెప్టెన్ సనా మిర్.