న్యూఢిల్లీ: క్రికెట్లో పాకిస్ధాన్ జట్టు కొత్త చరిత్రను సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది. ప్రస్తుతం వెస్డిండిస్తో జరుగుతున్న మూడో టెస్టులో పాక్ గెలిస్తే ఆ జట్టు కొత్త రికార్డుని సృష్టిస్తుంది. ఇప్పటికే ముగిసిన టీ20, వన్డే సిరిస్లలో వెస్డిండిస్ జట్టుని పాకిస్థాన్ క్లీన్ స్వీప్ చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఆ తర్వాత ఆడిన రెండు టెస్టుల్లో కూడా వెస్టిండిస్పై ఘన విజయం సాధించింది. ఇక మూడో టెస్టులో కూడా పాకిస్థాన్ విజంయ సాధిస్తే కొత్త చరిత్రను సృష్టించినట్లు అవుతుంది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా పర్యాటక జట్టుపై 9-0 తేడాతో గెలిచిన దాఖలా లేదు.

అయితే ఇప్పుడు ఈ సువర్ణావకాశం పాకిస్ధాన్కు అడుగు దూరంలో ఉంది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా దుబాయ్లో జరిగిన తొలి టెస్టులో పాక్ 56 పరుగుల తేడాతో విజయం సాధించగా, అబుదాబిలో జరిగిన రెండో టెస్టులో 133 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
మరోవైపు వెస్టిండిస్ కీలక ఆటగాళ్లు ఈ సిరిస్కు దూరమయ్యారు. మరోవైపు పాకిస్ధాన్ బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉంది. ఇటీవలే జట్టులోకి వచ్చిన పాక్ స్పిన్నర్ యాసిర్ షా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఆదివారం (అక్టోబర్ 30) షార్జాలో మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్లో కూడా వెస్టిండిస్... పాక్ చేతిలో ఓటమి పాలైతే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్న జట్టుగా అవతరిస్తుంది.