హైదరాబాద్: ఐసీసీ తప్పిదంతోనే పాకిస్థాన్ జట్టు టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంక్లో కొనసాగుతోందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తన అధికారిక వెబ్సైట్లో ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ముక్కోణపు టీ20 సిరిస్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే.
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ టోర్నీ ఆరంభానికి ముందు టీ20 ర్యాంకింగ్స్లో ఏడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు వరుసగా ఐదు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది.
దీంతో టోర్నీ ఫైనల్కి ముందు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఫైనల్లో ఆస్ట్రేలియా గెలిస్తే టీ20ల్లో నెంబర్ వన్ స్థానం తమకే దక్కుతుందని పేర్కొంది. ఫైనల్లో ఆసీస్ విజయం సాధించడంతో టోర్నీ విజేతగా నిలిచింది. దీంతో ఆ జట్టు ఖాతాలో 15 పాయింట్లు వచ్చి చేరాయి.
ఆస్ట్రేలియా గెలుపొందిన వెంటనే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ని విడుదల చేసింది. 126 రేటింగ్ పాయింట్లతో పాకిస్థాన్ అగ్రస్థానం సొంతం చేసుకోగా, అదే రేటింగ్ పాయింట్లున్న ఆస్ట్రేలియా 0.19 వ్యత్యాసం కారణంగా రెండో స్థానాన్ని దక్కించుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
అయితే, ఐసీసీ పాయింట్ల లెక్కింపుల్లో తప్పిదం జరిగిందని క్రికెట్ ఆస్ట్రేలియా ఆరోపించింది. పాకిస్థాన్కు 125. 84 పాయింట్లతో ఉండగా.. దాన్ని రౌండప్ చేసి 126 పాయింట్లుగా చేశారు. ఆస్ట్రేలియాకు కూడా 125.65, 0.19 పాయింట్లు ఉండగా ఇక్కడ దశాంశాల్లో రౌండప్ చేయకుండా రెండో ర్యాంక్ ఇచ్చారని సీఏ ఆరోపించింది.
టోర్నీకి ముందు 123 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఫైనల్లో ఓటమి పాలవ్వడంతో 116 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక, ర్యాంకింగ్స్ జాబితాలో రెండో స్థానంలో భారత్ (120) ఐదో స్థానంలో వెస్టిండీస్ (115), ఇంగ్లాండ్ (114), దక్షిణాఫ్రికా (113), శ్రీలంక (91), అఫ్గానిస్థాన్ (88), బంగ్లాదేశ్ (72) ఉన్నాయి.