
ఆస్ట్రేలియాలో జరిగిన T20 ప్రపంచకప్ 2022లో మొదటి నాలుగు మ్యాచ్లలో పాకిస్థాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ పై విమర్శాలు వస్తున్నాయి. కానీ వారికి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ మద్దతు తెలిపాడు. అతను ఓపెనింగ్ కాంబినేషన్ను 'జోడి నం.1' గా పేర్కొన్నాడు. పాకిస్తాన్ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీతో టోర్నమెంట్లోకి ప్రవేశించిందన్నాడు.
మిడిల్ ఆర్డర్
అయితే బాబర్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ ల్లో 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రిజ్వాన్ నెదర్లాండ్స్పై 49 సహా 71 పరుగులు చేశాడు. గురువారం (నవంబర్ 3) సిడ్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో వీరిద్దరూ మరోసారి విఫలమయ్యారు. అదృష్టవశాత్తూ పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ రాణించడంతో టోర్నమెంట్లో వారి ఆశలను సజీవంగా ఉంచడానికి ఈ గెలుపు సహాయపడిందన్నారు.

బంగ్లాదేశ్
పాక్ ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్ లో రాణించాలని చూస్తున్నారు. 2022లో, రిజ్వాన్ ఇప్పటివరకు 22 మ్యాచ్లలో 123.72 స్ట్రైక్ రేట్తో 892 పరుగులు సాధించగా, బాబర్ 23 గేమ్లలో 126.77 స్ట్రైక్ రేట్తో 625 పరుగులు చేశాడు. బాబర్ అజామ్ అండ్ కో. భారత్, జింబాబ్వేతో జరిగిన మొదటి రెండు మ్యాచ్లలో ఓటమిని చవిచూశారు. అయితే నెదర్లాండ్స్,ప్రోటీస్లపై విజయంతో మళ్లీ రేసులోకి వచ్చారు.