కరాచీ: యూరి ఉగ్రదాడి, పీవోకేలోకి ఇండియన్ ఆర్మీ వెళ్లి సర్జికల్ అటాక్ చేసిన నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని పది కిలోమీటర్ల మేర గ్రామస్తులను తరలిస్తున్నారు. దీంతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది ఆసక్తికరంగా స్పందించారు. చర్చల ద్వారా వివాదాలు, సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉండగా యుద్ధం లాంటి తీవ్ర నిర్ణయాలు వద్దని చెప్పారు. పైగా పాకిస్తాన్ శాంతికాముక దేశమన్నారు.
భారత్తో తాము సుహృద్భావ సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. యుద్ధమే వస్తే కనుక ఇరు పక్షాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. అందుకే యుద్ధానికి నో చెప్పండి అని షాహిద్ అఫ్రీది ట్వీట్ చేశారు. తాను క్రికెట్ ఆడిన దేశాలలో భారత్లో ఆడటమే గొప్పగా భావించానని గతంలో వ్యాఖ్యానించిన అఫ్రీది పైన స్వదేశంలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.