భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ అంటే.. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఎంతగా ఆసక్తి చూపుతారో మరోసారి స్పష్టమైంది. పైగా ప్రపంచకప్లో ఈ రెండు దేశాలు కాడెద్దుల్లా తలపడటం ఎప్పుడూ ఉత్కంఠతకు గురి చేసేదే. అభిమానులకు కన్నుల పండువను మిగిల్చేదే. తాజాగా ప్రపంచకప్ టోర్నమెంట్లో మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన భారత్, పాక్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్కు సంబంధించిన వీడియోను ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది తిలకించారు. డిజిటల్, సోషల్ మీడియాల ద్వారా మాత్రమే చూసిన ప్రేక్షకుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఈ మ్యాచ్ను వీక్షించిన వారి సంఖ్యను నిర్ధారించింది ఐసీసీ.
టీవీల ద్వారా చూసిన వారి సంఖ్యను లెక్కింపులోకి తీసుకోలేదు. క్రికెట్ ప్రపంచంలోనే కాదు.. ఏ క్రీడా ఈవెంట్ను కూడా వంద కోట్ల మంది ఇప్పటిదాకా చూసిన సందర్భాలు లేవు. మ్యాచ్కు సంబంధించిన వీడియో లింక్ను సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ఫాలంపై పోస్ట్ చేయగా.. వంద కోట్లకు పైగా హిట్స్ వచ్చినట్లు ఐసీసీ అధికారికంగా వెల్లడించింది.
క్రికెట్ దేవుడినీ వదల్లేదు: సచిన్ను చెడుగుడు ఆడేసిన ధోనీ అభిమానులు!
ఈ వీడియోను వంద కోట్ల మందికి పైగా చూశారని ఐసీసీ వెల్లడించింది. టీవీల ద్వారా భారత్, పాక్ మ్యాచ్ను 3.42 కోట్ల మంది వీక్షించిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే వీక్షకుల సంఖ్య ఒకేసారి 15 లక్షల 60 వేలకు చేరుకుందని, అనంతరం క్రమ, క్రమంగా పెరుగుతూ వెళ్లిందని హాట్స్టార్ యాజమాన్యం వెల్లడించింది.