హైదరాబాద్: పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ అజర్ అలీ (33) పరిమిత ఓవర్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. టెస్టు క్రికెట్పై పూర్తిగా దృష్టిసారించడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపాడు. 33 ఏళ్ల అజర్ అలీ మీడియాతో మాట్లాడుతూ ఇదే సరైన నిర్ణయమని తాను భావించినట్లు చెప్పుకొచ్చాడు.
"నా నిర్ణయాన్ని ప్రకటించాడనికి ముందు ఛీప్ సెలక్టర్, కెప్టెన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్తో ముందుగ మాట్లాడా. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా" అని లాహోర్లో విలేకరుల సమావేశంలో అజర్ అలీ అన్నాడు. కెరీర్లో 53 వన్డేలు ఆడిన అలీ 36.90 సగటుతో 1845 పరుగులు చేశాడు.
అందులో 3 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాకిస్థాన్ తరుపున ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో చివరి వన్డే ఆడాడు. పాకిస్థాన్ తరుపున టెస్టు క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఆటగాళ్లలో అజర్ అలీ ఒకడు. పాక్ తరుపున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ, డబుల్ సెంచరీలను సాధించాడు.
Top order batsman @azharali_ explains his decision, talks about his Test cricket future and best ODI memories. pic.twitter.com/otLNW9J4Cf
— PCB Official (@TheRealPCB) November 1, 2018