హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ రెండోసారి డోపింగ్ పరీక్షలో దోషిగా తేలాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా నిర్వహించిన డోప్ పరీక్షలోనూ అతను మళ్లీ పాజిటివ్గా తేలినట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించింది.
దీంతో అతను కనీసం మూడు నెలల పాటు నిషేధం ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలోనూ షెహజాద్ డోపింగ్లో దొరికాడు. దీంతో గతంలో అతడికి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. పాకిస్థాన్లో జరిగిన దేశవాళీ వన్డే టోర్నీ పాకిస్థానీ కప్ ఆడే సమయంలో అతనికి డోప్ పరీక్షలు నిర్వహించారు.
A player has reportedly tested positive for a prohibited substance. But under ICC rules PCB cannot name the player or chargesheet him until the chemical report is CONFIRMED by the Anti-Dope Agency of the government. We should have an answer in a day or two.
— PCB Media (@TheRealPCBMedia) June 20, 2018
ఆ పరీక్షల్లో అతడు పాజిటివ్గా తేలాడు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో జరిగిన ఈ టోర్నీలో అతడు మొత్తం 372 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. ఓ క్రికెటర్ డోపింగ్లో పాజిటివ్గా తేలినట్లు పాక్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. 26 ఏళ్ల అహ్మద్ షెహజాద్ ఇటీవలే స్కాట్లాండ్తో ముగిసిన రెండు టీ20ల సిరిస్లో ఆడాడు.
Ahmad Shahzad has been tested positive for Marijuana - the test was conducted prior to the Scotland series during Pakistan Cup.
— zainab abbas (@ZAbbasOfficial) June 20, 2018