ముంబై: ఐసీసీ వరల్డ్ టీ20ల్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్పై ఉత్కంఠకు తెరపడింది. వరల్డ్ టీ20 టోర్నమెంట్లో పాల్గొనేందుకు భారత్కు వచ్చేందుకు పాకిస్థాన్ జట్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో పాకిస్థాన్ జట్టు శుక్రవారం భారత్కు రానుంది.
ఇరుదేశాల మధ్య ఉన్నతాధికారుల సంప్రదింపులు జరపడంతో ఎట్టకేలకు పాకిస్థాన్ మెత్తబడింది. దీంతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్లో పాక్ మ్యాచ్ ఆడేందుకు అనుమతిచ్చారు. ఈ నెల 19న భారత్, పాకిస్థాన్ల మధ్య కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
నిజానికి టోర్నీ షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ని హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియాన్ని ఐసీసీ ఖరారు చేసింది. అయితే ధర్మశాల వేదిక నుంచి వేరే ప్రాంతానికి మార్చాలని పీసీబీ పంపించిన ఇద్దరు సభ్యుల బృందం సిఫారసు చేయడంతో ధర్మశాల నుంచి వేరే వేదికకు మ్యాచ్ని మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీని కోరింది.
అయితే తొలుత వేదికను మార్చే సమస్యే లేదని తేల్చిచెప్పిన ఐసీసీ, ఆ తర్వాత పాకిస్థాన్ ఆందోళనను పరిగణనలోకి తీసుకుని ఈ మ్యాచ్ వేదికను ధర్మశాల నుంచి వేరే వేదికకు మార్చే విషయాన్ని ఐసీసీ పరిశీలిస్తోంది. ఈ మేరకు ఐసీసీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సంప్రదించింది.
దీంతో భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన వేదిక మార్పే గనుక జరిగితే కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్కు మార్చారు. వేదిక మార్పుపై ఐసీసీ పరిశీలన ఉన్న నేపథ్యంలోనే మంగళవారం రాత్రి పాకిస్థాన్ నుంచి బయల్దేరాల్సిన ఆ దేశ జట్టు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు పీసీబీ పేర్కొంది.
సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్ జట్టు భారత్కు వస్తోంది. ముంబైలో ఉగ్రవాద దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో జరిగే ఆసియా కప్, వరల్డ్ కప్లలో ఇరు జట్లు పాల్గొనడం మినహా ద్వైపాక్షి సిరీస్లు ఆడలేదు.