Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కెప్టెన్సీ మార్పుల తమాషా మళ్లీ ఆరంభమైంది. తాజాగా మహ్మద్ రిజ్వాన్ ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు. రిజ్వాన్ స్థానంలో టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించబడిన షాహీన్ అఫ్రిదికి ఈ బాధ్యతలు అప్పగించారు. 2023 ప్రపంచ కప్ వరకు బాబర్ ఆజం మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్గా ఉన్నాడు. ఆ టోర్నమెంట్లో పాక్ సెమీఫైనల్కు కూడా చేరుకోలేకపోవడంతో కెప్టెన్సీ మార్పుల పర్వం మొదలైంది. అది నేటికీ కొనసాగుతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రెండేళ్లలో కెప్టెన్లను ఎప్పుడెప్పుడు మార్చిందో పూర్తి వివరాలను తెలుసుకుందాం.
నవంబర్ 2023: ప్రపంచ కప్లో పేలవ ప్రదర్శన అనంతరం బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.
నవంబర్ 2023: బాబర్ స్థానంలో షాన్ మసూద్ను టెస్ట్ కెప్టెన్గా.. షాహీన్ అఫ్రిదిని టీ20 ఇంటర్నేషనల్ కెప్టెన్గా నియమించారు.
మార్చి 2024: కేవలం 5 నెలల్లోనే షాహీన్ అఫ్రిదిని టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఈ సమయంలో అతను ఒక్క సిరీస్కే నాయకత్వం వహించాడు.

మార్చి 2024: బాబర్ ఆజంను మళ్లీ టీ20 ఇంటర్నేషనల్, వన్డే కెప్టెన్గా నియమించారు.
అక్టోబర్ 2024: టీ20 ప్రపంచ కప్ 2024 తొలి రౌండ్లోనే పాక్ నిష్క్రమించింది. కొన్ని నెలల తర్వాత బాబర్ మళ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. రెండోసారి కెప్టెన్ అయిన తర్వాత అతను ఒక్క వన్డేలో కూడా నాయకత్వం వహించలేదు.
అక్టోబర్ 2024: మహ్మద్ రిజ్వాన్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీ20 ఇంటర్నేషనల్, వన్డే జట్లకు కెప్టెన్గా నియమించింది.
మార్చి 2025: బ్యాటింగ్లో విఫలమైన కారణంగా మహ్మద్ రిజ్వాన్ను టీ20 జట్టు నుంచి తొలగించారు. అతడి స్థానంలో సల్మాన్ అలీ ఆఘాకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.
అక్టోబర్ 2025: మహ్మద్ రిజ్వాన్ను పాకిస్తాన్ వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. ఈ తొలగింపుకు పీసీబీ ఎలాంటి కారణం ప్రకటించలేదు.
అక్టోబర్ 2025: టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించబడిన షాహీన్ అఫ్రిదిని పాకిస్తాన్ వన్డే జట్టు కొత్త కెప్టెన్గా నియమించారు.
సల్మాన్ అలీ ఆఘాపైనా వేటుకు యోచన
సల్మాన్ అలీ ఆఘా కెప్టెన్సీలో ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ ప్రదర్శన నిరాశపరిచింది. భారత్తో జరిగిన మూడు మ్యాచ్లలో జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఇతర మ్యాచ్లలోనూ అతి కష్టం మీద మాత్రమే గెలవగలిగింది. కెప్టెన్సీతో పాటు సల్మాన్ బ్యాటింగ్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. త్వరలో సల్మాన్ నుంచి పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్సీని కూడా లాగేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి.