T20 World Cup 2022: వాతావరణం మన చేతుల్లో లేదు కానీ.. విలేకర్ల ప్రశ్నకు బాబర్ అజాం ఏం సమాధానం చెప్పాడంటే..

టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా సూపర్-12 లో ఆదివారం భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్తో జరిగే మ్యాచ్ కోసం పాకిస్థాన్ జట్టు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మెల్బోర్న్లో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ వర్షం ముప్పు ఉంది. మెల్ బోర్న్ లో వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ కు ముందు పాక్ కెప్టెన్ బాబర్ అజాం మీడియాతో మాట్లాడారు. మీ శిబిరంలోని ఆటగాళ్లు 'వర్షం, వర్షం, వెళ్లిపో' అంటున్నారా అని ఒక విలేకరి అడిగాడు. విలేకరుల అడిగిన ప్రశ్నకు పాక్ కెప్టెన్ మరింత ఉల్లాసంగా సమాధానం ఇచ్చాడు.

సిద్ధంగా ఉన్నాం
"వాస్తవంగా ప్రతి క్రికెట్ అభిమాని మెల్బోర్న్లోని వాతావరణ పరిస్థితులను గమనిస్తూనే ఉంటారు. విపరీతంగా మారుతున్న వాతావరణం సాయంత్రం MCG వద్ద వర్షం పడుతుందని సూచిస్తుంది. ఇది బహుశా భారత్, పాకిస్తాన్ మధ్య ఓవర్లు కుదించడానికి దారితీయవచ్చు. అయితే, పూర్తి 40 ఓవర్ల పోటీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు" అని చెప్పాడు. " చూడండి, వాతావరణం మన చేతుల్లో లేదు కానీ ఆటగాడిగా, కెప్టెన్గా, నేను మ్యాచ్ జరగాలని ఆశిస్తున్నాను. అందరూ ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.పూర్తి-నిడివి పోటీ జరుగుతుంది. మ్యాచ్ ఎంత సుదీర్ఘమైనా, మేము అన్ని రకాల పరిస్థితులను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని" బాబర్ స్పష్టం చేశాడు.

రోహిత్ శర్మ
అంతకుముందు, మ్యాచ్లో వాతావరణ గందరగోళంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మను కూడా అడిగారు. 20 ఓవర్ల పోటీ అయినా లేదా 5 ఓవర్లైనా మ్యాచ్లో అన్ని రకాల పరిస్థితులకు భారత్ సిద్ధమవుతోందని రోహిత్ చెప్పాడు. ఏది వచ్చినా సిద్ధంగా ఉండాలి.. ఈ విషయాలు మన చేతుల్లో ఉండవు.. 40 ఓవర్ల మ్యాచ్ అని భావించి వస్తాం.. కాకపోతే 20 ఓవర్ల మ్యాచ్కి అయినా సిద్ధంగా ఉన్నామని రోహిత్ చెప్పాడు. T20 వరల్డ్ కప్ 2022 సూపర్ 12 మ్యాచ్లో ఇండో-పాక్ యుద్ధం కోసం 1 లక్ష మంది ప్రజలు MCG వద్ద హాజరవుతారని అంచనా.

పోటాపోటీ
కాగా గతేడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్ లో భారత్ తో తలపడిన పాక్ విజయం సాధించింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఆసియా కప్ లో ఇరు జట్లు రెండు సార్లు పోటీ పడగా.. భారత్, పాక్ చెరోసారి విజయం సాధించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications