హైదరాబాద్: పాకిస్తాన్తో తొలి టెస్టులో ఎదురైన పరాజయానికి ఇంగ్లండ్ బదులు తీర్చుకుంది. రెండో టెస్టులో కేవలం మూడు రోజుల్లోనే విజయాన్ని సొంతం చేసుకొని సిరీస్ను 1-1తో ముగించింది. రెండో టెస్టులో పాక్ మూడు రోజుల్లో.. ఇన్నింగ్స్ 55 పరుగుల తేడాతో చిత్తయింది. ఓవర్నైట్ స్కోరు 302/7తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్.. 363 పరుగులకు ఆలౌటైంది.
ఆతిథ్య జట్టు పేసర్లు బ్రాడ్ (3/28), బెస్ (3/33) ధాటికి రెండో ఇన్నింగ్స్లో పాక్ 134 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బట్లర్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'... అబ్బాస్కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు దక్కాయి.
పాక్ బ్యాట్స్మెన్లో ఇమాముల్ హక్ (34), ఉస్మాన్ (33) ఫర్వాలేదనిపించగా... అజహర్ అలీ (11), హరీస్ సోహైల్ (8), అసద్ షఫీక్ (5), కెప్టెన్ సర్ఫరాజ్ (8), షాదాబ్ ఖాన్ (4) విఫలమయ్యారు. అంతకుముందు 302/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 363 పరుగులకు ఆలౌటై 189 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ..పాక్.. కేవలం 134 పరుగులకే కుప్పకూలింది. బ్రాడ్ (3/28), బెస్ (3/33), అండర్సన్ (2/35) పాక్ పతనాన్ని శాసించారు. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 174 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
టెస్టులో పాల్గొన్న వారి జట్టు వివరాలిలా ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్లో పాకిస్థాన్ సాధించిన స్కోరు: 174; అనంతరం తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్: 363 (బట్లర్ 80, బెస్ 49; అష్రఫ్ 3/60), పాక్ రెండో ఇన్నింగ్స్: 134 (ఇమాముల్ హక్ 34; బ్రాడ్ 3/28, బెస్ 3/33).