కోల్ కతా: మిస్భా ఉల్ హక్, కెప్టన్ కమ్రాన్ అక్మల్ సెంచరీలతో కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ పుంజుకుంది. టాప్ ఆర్డర్ ను కోల్పోయిన దశలో డిలాపడిన పాకిస్థాన్ కు మిస్భా, అక్మల్ లు జట్టు కట్టి ప్రాణం పోశారు. దీంతో పాక్ భారీ పరుగుల దిశగా పయణిస్తోంది. ఆదివారం ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. మిస్బా, అక్మల్ ల భాగస్వామ్యాన్ని భారత బౌలర్ హర్బజన్ సింగ్ విడదీశాడు. అక్మల్ 119 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆదివారం ఆట ముగిసే సమయానికి మిస్బా 108 పరుగులతో సమీ పరుగులేమీ చేయకుండా క్రీజ్ లో ఉన్నారు. మిస్పాకు ఇది తొలి టెస్టు సెంచరీ. అక్మల్, మిస్బా ఆరో వికెట్ కు 200కు పైగా పరుగులను జోడించారు. అంతకుముందు వికెట్ నష్టానికి 50 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన పాక్ అతి తక్కువ పరుగులకే టాప్ ఆర్డర్ ను కోల్పోయి కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 36 పరుగుల వద్ద యాసర్ హమీద్(21) ఔటయ్యాడు. కుంబ్లే బౌలింగ్ లో యాసర్ హమీద్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. మూడో రోజు ఆట ప్రారంభంలో జట్టుకు యూతమిస్తాడనుకున్న సల్మాన్ భట్ (42) హర్బజన్ విసిరిన బంతిని ద్రావిడ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. అనంతరం రెండు ఓవర్లకే పటేల్ విసిరిన బంతితో ధోనీ కీపర్ క్యాచ్ ద్వారా యునెస్కాన్(43) ఔటయ్యాడు. అటు తర్వాత ఆరో వికెట్ గా బ్యాటింగ్ కు దిగిన మొహ్మద్ యూసుఫ్ 6 పరుగులకే చతికిలపడగా, కుంబ్లే విసిరిన బంతికి ఎల్పీడబ్ల్యూ ద్వారా ఇక్బాల్(0) నిష్క్రమించడంతో పాక్ కష్టాల్లో పడింది. కీలకమైన సమయంలో మిస్బా, అక్మల్ రాణించి పాక్ ను ఆదుకున్నారు.