ప్రయాణంలో ఆందోళన చెందా
ఆదివారం తన ఫెస్బుక్లో ఓ వీడియో పంచుకున్న షకీబుల్.. కరోనాపై స్పందించాడు. తన కూతురు అలైనా హసన్ను చూడకపోవడం చాలా బాధగా ఉందని భావోద్వేగం చెందాడు. 'కొన్ని రోజుల క్రితం నేను అమెరికాకు వచ్చాను. విమానంలో ప్రయాణించేటప్పుడు వైరస్ కారణంగా ఆందోళన చెందా. అయితే ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నా. అమెరికా చేరుకున్నాక నేరుగా హోటల్కు వెళ్లి స్వీయ నిర్బంధంలో ఉన్నా. ఇదే విషయాన్ని నా భార్య (ఉమ్మె అహ్మద్ షిషిర్), కూతురికి చెప్పాను' అని షకీబుల్ వీడియోలో పేర్కొన్నాడు.
కూతుర్ని కూడా కలవలేకపోయా
'నేను విమానంలో ప్రయాణించడంతో నాపై వైరస్ ప్రభావం ఉండొచ్చు. అందుకే స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నా. అమెరికాకి వచ్చాక నా కూతుర్ని కూడా కలవలేకపోయా. చాలా బాధగా ఉంది. కానీ.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ త్యాగం ఎంతో అవసరం. విదేశాల్లో ఉండేవారు ఇళ్లలో ఉండటం ఎంతో ముఖ్యం. బయటకు రాకుండా ఉండండి. బంధువులు, చుట్టుపక్కల వారిని కూడా కలవకూడదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. కనీసం 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలి' అని మాజీ కెప్టెన్ సూచించాడు.
రెండేళ్ల నిషేధం
షకీబుల్ అక్టోబర్ 2019 నుండి క్రికెట్ ఆడలేదు. 2018 జనవరిలో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకీబుల్ను బుకీలు సంప్రదించారు. ఈ విషయం ఐసీసీకి వెల్లడించడంలో విఫలమైనందుకు ఆర్టికల్ 2.4.4 ప్రకారం రెండు అభియోగాలు నమోదయ్యాయి. ఇక 2018 ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా కూడా బుకీలు సంప్రదించారు. ఆ విషయాన్ని కూడా వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం జరిపిన విచారణలో షకీబుల్ తన తప్పులను ఒప్పుకున్నాడు. తప్పు అంగీకరించడంతో ఐసీసీ శిక్ష విధించింది.