హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై హత్యాయత్నం, గృహహింసతో పాటు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని అతడి భార్య హసిన్ జహాన్ కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో షమీతో పాటు నలుగురు కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా షమీపై సంచలన ఆరోపణలు చేస్తోన్న అతడి భార్య తనకు మద్దతుగా నిలవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో మమతా బెనర్జీతో షమీ భార్య సమావేశమైంది.
సుమారు పది నిమిషాల పాటు పలు ఈ వ్యవహారంపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మమతా హామీ ఇచ్చినట్లు జహాన్ సన్నిహితులు తెలిపారు. మరోవైపు షమీపై అతడి భార్య చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చింది.
నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
దీంతో షమీని బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు ఇవ్వడంతో పాటు త్వరలో ఆరంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్లో కూడా షమీ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులో షమీకి బీ గ్రేడ్ కాంట్రాక్టు లభించింది. ఈ కాంట్రాక్టు కింద షమీ రూ. 3 కోట్లు వేతనంగా పొందనున్నాడు.
ఎంతో మానసిక క్షోభకు గురయ్యా: షమీ
మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేకపోవడం, బీసీసీఐ కాంట్రాక్టు దక్కడం, ఐపీఎల్లో ఆడటంపై షమి తాజాగా సంతోషం వ్యక్తం చేశాడు. 'ఇది పూర్తిగా కుటుంబానికి సంబంధించిన సమస్య. నాకు వ్యతిరేకంగా వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. గత 10-15 రోజులుగా ఎంతో మానసిక క్షోభకు గురయ్యా. ఈ రోజులన్ని ఎంతో కఠినంగా గడిచాయి. వీలైనంత త్వరగా వీటన్నింటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా' అని తెలిపాడు