
కొన్ని సార్లు ఆడామనుకున్నా.. ప్రతికూలంగా
త్వరలోనే టీమిండియా వన్డే జట్టులో చోటుదక్కుతుంది. కచ్చితంగా 2019 ప్రపంచకప్ టోర్నీ ఆడుతాననే నమ్మకం ఉంది. ఇది జరగాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడటం ఎంతో ముఖ్యం. నా బ్యాటింగ్ టెక్నిక్లో ఎలాంటి సమస్య లేదు. కొన్ని సార్లు అద్భుతంగా ఆడామనుకున్నా ఫలితం మనకు ప్రతికూలంగా ఉంటుంది.

టెస్టులకు జట్టులో చోటుదక్కకపోవడంతో
స్పిన్ బౌలింగ్ను ఎలా సమర్ధవంతంగా ఎదుర్కోవాలనే అంశంపై కసరత్తులు మొదలు పెట్టా. ఇప్పటికే ఈ విషయంలో చాలా మెరుగయ్యాను. అందుకే నేను డొమెస్టిక్ టోర్నమెంట్స్ ఆడుతున్నాను. దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి రెండు టెస్టులకు జట్టులో చోటుదక్కకపోవడంతో బాధపడలేదు. అలా అయితే ఏంచేయలేం. అది మనచేతులో ఉండదు.

పర్యటనకు పదిరోజులు ముందుగా వెళ్లనున్నామని,
టీమ్మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని మనం గౌరవించాలి. నాకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోనే ఎదురు చూశానని రహానె స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు పదిరోజులు ముందుగా వెళ్లనున్నామని, అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడునున్నామని తెలిపాడు. ఏ దేశాన్నైనా వారి సొంతగడ్డపై ఎదుర్కోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పనేనని చెప్పుకొచ్చాడు.

ఉమేశ్ అత్యంత వేగమైన బౌలర్ని రహానే
ఇరు జట్లలో మంచి బౌలింగ్ అటాక్ ఉందని, ఈ సిరీస్ రసవత్తరంగా సాగనుందని పేర్కొన్నాడు. తన దృష్టిలో బుమ్రా కష్టమైన బౌలరని, ఉమేశ్ అత్యంత వేగమైన బౌలర్ని రహానే చెప్పుకొచ్చాడు. ఇక 2016 నుంచి వన్డేల్లో 48 ఇన్నింగ్స్లు ఆడిన రహానే కేవలం మూడు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు.


Click it and Unblock the Notifications
