
సిడ్నీ టెస్టులోనూ ఇదే జోరుని కొనసాగిస్తామని
సిరీస్లో 2-1తో ఆధిక్యాన్ని అందుకున్న భారత్.. 399 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆదివారం ఓవర్నైట్ స్కోరు 258/8తో రెండో ఇన్నింగ్స్ని కొనసాగించింది. వర్షం అనంతరం బౌలర్లు రెచ్చిపోయారు. మిగిలిన రెండు వికెట్లను అవుట్ చేసి లాంచనప్రాయమైన విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 261 పరుగులకే ఆలౌటైంది. మెల్బోర్న్ టెస్టులో గెలుపొందిన తర్వాత మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. సిడ్నీ టెస్టులోనూ ఇదే జోరుని కొనసాగిస్తామని చెప్పుకొచ్చాడు.
భారత్ అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించి
‘సిరీస్లో మా ఆధిపత్యాన్ని ఇక్కడితో సరిపెట్టుకోవాలనుకోవడం లేదు. ఈ విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. చివరి టెస్టు అయిన నాలుగో టెస్టులో రెట్టించిన ఉత్సాహంతో సిడ్నీలో ఆడతాం. సిరీస్లో గెలిచిన రెండు టెస్టుల్లోనూ భారత్ జట్టు అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించింది. అయితే.. ఆస్ట్రేలియా గడ్డపై మేం చేయాల్సిన పని మిగిలే ఉంది. ఆఖరి టెస్టులో విజయం తప్పక సాధించాలి.

ప్లేయర్ల బ్యాటింగ్ వైఫల్యమే కొంపముంచింది
చివరి మ్యాచ్లో గెలిచేందుకు ఏ అవకాశం లభించినా.. వదులుకోం. కచ్చితంగా ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయిస్తాం' అని విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా కెప్టెన్ తీరు ఇలా ఉంటే ఆసీస్ కెప్టెన్ తమ జట్టు వైఫల్యాలని ఎత్తి చూపుతూ సమావేశాన్ని ముగించాడు. మా ప్లేయర్ల బ్యాటింగ్ వైఫల్యమే కొంపముంచింది. అనుభవలేమితో బరిలోకి దిగడమే ఇలాంటి పరాభవానికి కారణమైందని వెల్లడించాడు.


Click it and Unblock the Notifications












