
భారత్కే తొలి ప్రాధాన్యం
దీంతో ఈ సారి కూడా ఐపీఎల్ను బీసీసీఐ విదేశాల్లోనే నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఐపీఎల్ నిర్వహణల్లో తొలి ప్రాధాన్యం మాత్రమే భారత్కే ఇస్తున్నట్టు తెలిసింది. భారత్లో ఐపీఎల్ నిర్వహించే అన్ని అవకాశాలను బీసీసీఐ అన్వేషిస్తోందని సమాచారం. అవసరమైతే ఒకే వేదికలో టోర్నీ నిర్వహించాలని భావిస్తోందట. లేదా ప్రేక్షకులు లేకుండా అయినా సరే నిర్వహించాలని అనుకుంటుందట. ఇవేవి కుదరకపోతేనే విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది.

ముందుగా వేలం నిర్వహణ
అయితే దీనికంటే ముందు ఐపీఎల్ మెగా వేలాన్ని పూర్తి చేయాలని బీసీసీఐ అధికారులు అనుకుంటున్నట్లు సమాచారం. నిజానికి డిసెంబర్లోనే మెగా వేలం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వేలం వాయిదా పడింది. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది.

వేసవిలో ఐపీఎల్
ఇప్పటి వరకు ఐపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించికపోయినా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా వేసవిలో ఈ టోర్నమెంట్ జరగనుంది. వేదికలను కూడా బీసీసీఐ ఇప్పటివరకు ప్రకటించలేదు. కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిబంధనలు తీసుకువస్తాయనే దానిపై వేదికల ఖరారు నిర్ణయం ఆధారపడి ఉంది. ఒక వేళ విదేశాల్లో నిర్వహించాల్సి వస్తే గతంలో మాదిరిగా యూఏఈలోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గత సీజన్లు విదేశాల్లోనే
కరోనా కారణంగా 2020 ఐపీఎల్ సీజన్ను బీసీసీ పూర్తిగా యూఏఈలోనే నిర్వహించింది. అలాగే 2021 ఐపీఎల్ సీజన్ భారత్లో సగం ముగిశాక కరోనా విజృంభించడంతో మిగతా సీజన్ను యూఏఈలోనే నిర్వహించింది. కాగా దేశంలో కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఇప్పటికే రంజీ ట్రోఫీతోపాటు ఇతర స్థానిక టోర్నిలన్నింటినీ బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












