Operation Sindoor: పహల్గామ్ దాడికి భారత ప్రభుత్వం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK)లలో వైమానిక దాడులు చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్'ను విజయవంతంగా నిర్వహించింది. ఈ ఆపరేషన్తో పాకిస్థాన్కు 100 కిలోమీటర్ల పరిధిలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసి ధ్వంసం చేసింది. భారత సైన్యం మే 7న అర్ధరాత్రి పాకిస్థాన్, పీఓకేపై 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది. భారత ప్రభుత్వ చర్యపై గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా సహా అనేక మంది ప్రముఖ భారత క్రికెటర్లు స్పందించారు. ఇప్పుడు క్రికెటర్లు "జై హింద్" అంటూ తమ మద్దతును తెలియజేస్తున్నారు.
ఆనందం వ్యక్తం చేసిన గౌతమ్ గంభీర్
పహల్గాంలో జరిగిన బాధాకరమైన ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుని పాకిస్థాన్ ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో పాకిస్థాన్లోని అనేక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. అనేక మంది ఉగ్రవాదులు కూడా మరణించారు. భారత్ తరఫున టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆపరేషన్ సిందూర్ పోస్టర్ను ట్వీట్ చేసి 'జైహింద్' అని రాసుకొచ్చారు. గంభీర్ ట్వీట్ ను వేలాది మంది లైక్ చేశారు.

ట్వీట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆపరేషన్ సిందూర్ గురించి ట్వీట్ చేశాడు. 'ధర్మో రక్షతి రక్షితః, జై హింద్ కీ సేన' అని సెహ్వాగ్ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఈ దాడి తర్వాత ట్వీట్ చేసి 'మనమందరం కలిసి నిలబడదాం.. జై హింద్' అని రాశారు.
పహల్గామ్ దాడిపై ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యం
పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం బుధవారం భారీ చర్య చేపట్టింది. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఆపరేషన్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నారు. ఆ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఆపరేషన్ 'సిందూర్' అని పేరు పెట్టబడిన ఈ ఆపరేషన్, జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్), లష్కరే-తోయిబా (ఎల్ఇటి), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి నిషేధిత ఉగ్రవాద గ్రూపులకు చెందిన తొమ్మిది రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.