
హైదరాబాద్: అప్పట్లో 99 టెస్ట్ మ్యాచ్లు ఆడిన చరిత్ర కల్గి ఉన్న అజారుద్దీన్ 1985 వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున తన తొలి సెంచరీని నమోదు చేశాడు. అంతేకాదు ఆ రోజు జరిగిన మ్యాచ్ లో అజహర్ రెచ్చిపోయి ఆడి 110 స్కోరును నమోదు చేశాడు.
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మూడో టెస్ట్ 3 జనవరి 2018న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్పై మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఐదో వాడిగా దిగిన అజహర్ రెచ్చిపోయి ఆడాడు. కాగా భారీ స్కోరును సంపాదించి పెట్టడంలో ప్రధాన పాత్ర వహించాడు. కానీ, జట్టు సమష్టిగా గెలవలేకపోయింది.
మరో 20నిమిషాలు ఆడితే గెలుస్తుందనగా వర్షం వచ్చి పడటంతో రెండో టెస్టును మూడో రోజుకు వాయిదా వేశారు. ఇండియా మ్యాచ్ ను437-7 డిక్లేర్ చేసింది. మొత్తంగా భారత్ 2-1 తేడాతో ఈ సిరీస్ను కోల్పోయింది.
ఈ టెస్ట్ సిరీస్తో అజహరుద్దీన్ తన ఖాతాలో మూడు సెంచరీల రికార్డు చేసి ఆ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.
ఆ మ్యాచ్ ఫలితాలిలా ఉన్నాయి.
India 437-7 decl. (Ravi Shastri 111, Mohammad Azharuddin 110; Phil Edmonds 3-72, Norman Cowans 3-03) and 29-1 drew with England 276 (Allan Lamb 67, Graeme Fowler 49; Chetan Sharma 4-38, Shivlal Yadav 4-86)
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.